5 రూపాయలకు ఏమోస్తుంది అని అడిగితే ఏమని చెప్తాం. కనీసం సింగిల్ టీకూడా రాదు. టిఫిన్ చేయాలంటే కనీసం రూ.30 నుంచి రూ. 50 వరకు ఉండాలి. రోడ్డు పక్కన ఉన్న టిఫెన్ షాపులో తినాలన్నా ఎట్టలేదన్నా కనీసం రూ.20 అయినా ఉండాలి. అయితే, నాగపూర్లోని భారత్మాతా చౌక్ వద్ద ఉన్న టీబీ ఆసుపత్రి ముందు ఓ 65 ఏళ్ల బామ్మ టిఫెన్ బండి నడుపుతుంది. ఆమె రోజు తర్రి పోహాను విక్రయిస్తుంది. అదీకూడా కేవలం 5 రూపాయలకే. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోహాను విక్రయిస్తుంది.
Read: టీచర్కు అవమానం: స్టూడెంట్స్ సీరియస్సైన నెటిజన్లు…
గత 15 ఏళ్ల నుంచి బామ్మ పోహాను విక్రయిస్తున్నది. భర్త చనిపోయిన తరువాత ఎలాంటి ఉపాధి లేకపోవడంతో ఇలా టిఫెన్ కొట్టును పెట్టుకొని పోహాను విక్రయిస్తోంది. విషయం తెలుసుకున్న ఓ ఫుడ్ బ్లాగర్ తన ఇన్స్టాగ్రామ్లో ఆమె స్టోరీని పోస్ట్ చేశాడు. బామ్మకు సహాయం చేయాలని కోరాడు. బామ్మ గురించి తెలుసుకున్న చాలా మంది నెటిజన్లు ఆమెను మెచ్చుకున్నారు. మెచ్చుకోవడమే కాదు, కొంతమంది ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి