పోసాని వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్… మీమ్స్ తోనే అంతా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అటు వైసీపీ నేతలు పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, పోసాని చేసిన ఘాటు వ్యాఖ్యలపై జనసేనాని అభిమానులు మండిపడుతున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఈ వివాదంపై స్పందించారు. ఇంస్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ’ సెషన్ నిర్వహించారు. అందులో భాగంగానే పోసాని వివాదం నుంచి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం వరకు అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
Read Also : పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
ఈ సెషన్ లో ఓ నెటిజన్ ‘మళ్ళీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారా ?’ అని అడగ్గా… ‘నాకు ఇంట్రెస్ట్ పోయింది’ అనే మీమ్ ను షేర్ చేశారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఎలా ఉందని మరొకరు ప్రశ్నించారు. ‘తేజ్ త్వరలోనే మన ముందుకు వస్తాడు’ అని అన్నారు. ఇక ‘పవన్ కళ్యాణ్ మ్యాటర్ గురించి స్పందించండి’ అంటూ పవన్ అభిమానులు అడగ్గా గతంలో పవన్ గురించి పోసాని మాట్లాడిన వీడియోను సమాధానంగా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ‘పవన్ మళ్ళీ హీరోగా యాక్ట్ చేస్తానంటే అతనికి బ్లాంక్ చెక్ ఇస్తా. కోటి, రెండు కోట్లు, పది, ఇరవై, ముప్పై కోట్లు… నాకు డేట్స్ ఇస్తే 40 కోట్లు కూడా ఇస్తా. ఆయనకు అంత డిమాండ్ ఉంది. టాలీవుడ్ లోనే ఇండియాలోని టాప్ హీరోల్లో ఆయన ఒకరు. 5, 10 కోట్ల కోసం ఆయన లంగా పనులు చేయరు. నాకు తెలుసు’ అని పోసాని స్వయంగా చెప్పడం అందులో కన్పిస్తుంది. ఇక పోసాని గురించి ఒక్క మాట అని అడగ్గా… ‘సమరసింహారెడ్డి’లో బాలకృష్ణ ఫొటో పోస్ట్ చేశారు. ఆ సన్నివేశంలో బాలకృష్ణ ‘కుక్క మొరిగిందనుకో’ అనే డైలాగ్ చెప్తాడు. అలా మెగా ఫ్యాన్స్ కు ఈ మెగా బ్రదర్ ఏది డైరెక్ట్ గా చెప్పకుండా మీమ్స్, వీడియోలతోనే క్లారిటీ ఇచ్చారు. ఇక ఆన్లైన్ సినిమా టిక్కెటింగ్ విధానంపై కూడా తనదైన శైలిలో స్పందించారు నాగబాబు. ‘విక్రమార్కుడు’లో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే సీన్ ‘చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడైనా సరిగా పంచావ్రా!’ అని వాపోతూ ‘మోసం చేసినవాడు బాగుపడడురా!’ అని బ్రహ్మానందం శపించగా… ‘ఆ మనం చేసేది గుళ్లో పూజ మరి’ అని రవితేజ అంటాడు.



తాజావార్తలు
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
ట్రెండింగ్
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి