వేతనాలు,పెన్షన్లపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వేతనాలు, పెన్షన్లపై చీఫ్ సెక్రెటరీ లెక్కలు ఉద్యోగుల్నీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు. 111 శాతం ఖర్చు చేస్తున్నట్టు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు, పించన్లపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని అన్నారు. ఉద్యోగులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేలా అంకెల గారడీ చేశారని, రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎందుకు ఈ విషయం ప్రస్తావించలేదని అన్నారు. అసెంబ్లీలో లెక్కలు పక్కాగా చెప్పాల్సి ఉంటుందని, ఈ తప్పుడు లెక్కల నివేదికను ఎవర్ని మోసపుచ్చడానికి తయారు చేయించారని ప్రశ్నించారు.
Read: వీడి కక్కుర్తి తగలయ్య… కరోనాకు భయపడి 10 వ్యాక్సిన్లు తీసుకున్నాడట…
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీచేశారో చెప్పాలని అన్నారు. నెలకు ఉద్యోగుల జీతాలకు, పెన్షన్ల కోసం రూ. 4600 కోట్లు ఖర్చు అవుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాయని, ఈ విషయం నిజం కాకపోతే చీఫ్ సెక్రటరీ, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎందుకు ఖండించలేదని, ఏటా 67 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఎందుకు ప్రకటించలేదని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తరువాత నియమించిన వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జీతాలను కేంద్రం ఇచ్చే నిధుల నుంచే మళ్లిస్తున్నారని, ఏ దశలో రాష్ట్రప్రభుత్వం ఖజానాకు భారం పడుతుందో పారదర్శకంగా చెప్పాలని అన్నారు. ప్రతీ ఏటా ప్రభుత్వ ఉద్యోగం నుంచి సుమారు 15 వేల మంది రిటైర్ అవుతున్నారని, ఆ మేరకు భర్తీ జరగడంలేదని నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదని, మరి ఏ విధంగా వ్యయం పెరిగిందో వెల్లడించాలని జనసేన నేత ప్రశ్నించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం కంటే ఎక్కువగా జీతాలకు ఇస్తున్నామని చెప్పడం ఆర్థికశాఖ దివాళాకోరుతనాన్ని వెల్లడిస్తుందని, ఈ తప్పుడు లెక్కలపై ప్రతి ఉద్యోగి ప్రశ్నించాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డిడి క్రేజ్ మాములుగా లేదుగా.! క్రికెటర్స్ మాత్రమే కాదు WWE స్టార్స్ కూడనా..
-
Manchu Manoj: అనాథలకు అండగా మంచు మనోజ్.. త్వరలో భారీ పునరావాస కేంద్రం!
-
CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
-
Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!