ఆంగ్ సాన్సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ప్రత్యేక న్యాయస్థానం.. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న ఆమె.. గతంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో ఈ శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది కోర్టు.. ఆమె కరోనా నిబంధనలను ఉల్లంఘించారని, మిలిటరీకి వ్యతిరేకంగా ఇతరులను ప్రేరేపించారని రుజువు కావడంతో ఈ తీర్పును వెలువరించింది ప్రత్యేక కోర్టు.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్లో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి సూకీపై అనేక ఆరోపణలు మోపబడ్డాయి.. వరుసగా అన్నింటిపై దర్యాప్తులు జరుగుతుండగా.. శిక్ష విధించడం అయితే ఇదే తొలిసారి..
Read Also: ఇప్పటికైతే ‘ఒమిక్రాన్’ టెన్షన్ తప్పింది..! ఆమెకు నెగెటివ్
Also Read
అయితే, ఆంగ్ సాన్ సూకీ, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలను మిలిటరీ నిర్బంధించిన అనంతరం.. ఆమె పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాల్లో వివాదాస్పద పోస్టులు దర్శనమిచ్చాయి. దానిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, సూకీ తప్పుచేశారని తేల్చారు. ఇక, 2020 నవంబర్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడానికి ముందు.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని కూడా సూకీపై కేసు నమోదైంది.. ఆ ఎన్నికల్లో వరుసగా రెండోసారి సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్డెమొక్రసీ పార్టీ విజయం సాధించింది.. కానీ, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.. అనంతరం సైన్యం తిరుగుబాటు చేయడం.. సూకీ సహా నేతలను నిర్బంధించడం.. అది కాస్త హింసకు దారితీయడం.. ఇలా చాలా పరిణామాలు జరిగిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!