కేటుగాళ్ళు ఎక్కవవుతున్నారు. నకిలీ పోలీసులు,నకిలీ రిపోర్టర్లుగా చలామణి అవుతున్న ఇద్దరి ఆటకట్టించారు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు వారి వివరాలు వెల్లడించారు. మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్ లలో నకిలీ ఎస్వోటీ పోలీసుల పేరుతో మాముళ్ళు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం,2 మొబైల్ ఫోన్స్,2 నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
మోడెజబా మనిక్ (32),కొత్తగాడి అమర్నాథ్ (33) అనే ఇద్దరు మియపూర్ లోని రేవ్ లాన్ బ్యూటీ ఫామిలీ స్టూడియో లో మేము ఎస్వోటీ పోలీసులమంటూ నెల మాముళ్ళు 30 వేలు డిమాండ్ చేశారు. చివరకు 10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు నిందితులు. మసాజ్ సెంటర్ నిర్వాహకులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పక్క సమాచారం తో నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చెయ్యగా వారు రెండు వేరువేరు పత్రికలలోఇదివరకు పని చేసి మానేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని మియపూర్ పోలీసులకు అప్పగించారు ఎస్వోటీ పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు.