Minister Seediri: విశాఖే రాజధాని నో డౌట్.. సీఎం జగన్ గొప్ప పాలసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖే రాజధానిగా పరిపాలన కొనసాగుతుందని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా విశాఖకు ఫిఫ్ట్ అవుతున్నారు. ఈ మేరకు ఆయన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రకటించారు. రాజధానిగా విశాఖపట్నం ఖాయమని, పాలన సాగించడానికి అవసరమైన అన్ని వసతులు అక్కడ ఉన్నాయని వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో సీదిరి అప్పలరాజు అప్పల రాజు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రాజధానిగా త్వరలొనే ఏర్పడుతుంది అని ఆయన అన్నారు. విశాఖ రాజధాని చేయాలని గొప్ప పాలసీ సిఎం జగన్ తీసుకువచ్చారని తెలిపారు.
Also Read:5G Smart Phone: మోటరోలా నుంచి స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
స్దానిక సంస్దలు , పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటు హాక్కును వినియోగించుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు.. విపక్ష పార్టీపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్షం దొంగ దిబ్బతీయాలనే కులాల పేరుతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్దిగా ఇండిపెండెంట్ ను బరిలో ఉంచారని అన్నారు. కులాలు ఎగదోసి, పార్టీల వెనుకుండి , అసమానతలు రెచ్చకొట్టడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని ఆరోపించారు. ఈ ఎన్నిలతో అయినా బుద్ది తెచ్చుకోవాలన్నారు. గ్రాడ్యుయేట్స్ వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్ది సీతంరాజు సుధాకర్ కు మద్దతుగా ఉండాలని కోరారు. తమ కులం వారే బాగుపడాలని లక్ష్యంతో అమరావతి రాజధాని కావాలంటూ టీడీపీ కోర్టుకు వెళ్లిందని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరిని గ్రాడ్యుయేట్స్ గ్రహించాలన్నారు. గెలవటానికి టిడిపి పోటీచేయటం లేదని, వైసీపీ అభ్యర్థిని ఓడించాలని కుమ్మక్కు రాజకీయాలకు తెరతీసారని ధ్వజమెత్తారు.రెండవ ప్రాధాన్యత విశయంలో ఇతరపార్టీలతో టిడిపి కమ్మక్కుఅయిందని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికలు వస్తే నక్కజిత్తులు చేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. జిల్లాలో పొలింగ్ ఉత్సాహంగా కొనసాగుతుందన్న మంత్రి.. వైసిపి శ్రేణులు ఒటర్లను ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు గ్రామాల నుంచి తరలిస్తున్నారని తెలిపారు.
Also Read:Dadisetti Raja: ఆర్ఆర్ఆర్కు వచ్చిన ఆస్కార్ కంటే పవన్ యాక్టింగ్ ఎక్కువ..! మంత్రి ఫైర్
కాగా, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా పొదిలి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుంది. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా అడ్డగించారు. ఒంగోలు సెయింట్ థెరీసా కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల వివాదం నెలకొంది. ఎమ్మెల్యే బాలినేని, మాజీ ఎమ్మెల్యే దామచర్ల రాకతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఎన్టీఆర్ భవన్లో పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాలినేని వైఖరిపై ప్రకాశం ఎస్పీకి చంద్రబాబు ఫోన్ చేశారు. వైసీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. బాలినేనిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!