MLC election polling: ప్రశాంతంగా కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC election polling: ప్రశాంతంగా రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం ఓటర్లలో పురుషులు 15,472, మహిళలు 14,246 కాగా.. ఇతరులు ఇద్దరు ఉన్నారు.
137 పోలింగ్ కేంద్రాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో 15, నాగర్ కర్నూల్ జిల్లాలో 14, వనపర్తి జిల్లాలో 7, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 11, నారాయణపేట జిల్లాలో 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ జిల్లాలో 18, మేడ్చల్ లో 14 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. -మల్కాజిగిరి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలు. . ఎన్నికల నిర్వహణకు 593 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇక.. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 137 మంది పీవోలు, 137 మంది ఏపీఓలు, 319 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరిలో 146 మందిని రిజర్వ్గా నియమించారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రిసెప్షన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 12 మంది సెక్టార్ కంట్రోల్ అధికారులను నియమించారు.
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
Read also: Happy Birthday Kavitakka: ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా బర్త్డే విషెస్..
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జిల్లాలో 1,822 మంది ఓటర్లు ఉండగా.. 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా.. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాలలో 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇబ్రహీంపట్నంలో 207, మంచాలలో 62, యాచారంలో 85 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మరోవైపు హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఎన్నికలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ముషీరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 109వ కేంద్రంలో 7 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయులు ఓట్లు వేసేందుకు ఇప్పటికే బారులు తీరారు. పోలింగ్ సిబ్బంది సమయానికి వచ్చినప్పటికీ బ్యాలెట్ బాక్స్ సీల్ చేయడంలో జాప్యం జరగడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే.. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 333 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు.
ఏపీలోనూ ప్రశాంతంగా పోలింగ్..:
ఆంధ్రప్రదేశ్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయులు, 4 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
PM Modi: ‘నాటు నాటు’ సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది.. ప్రధాని అభినందనలు
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!