MLC election polling: ప్రశాంతంగా రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం ఓటర్లలో పురుషులు 15,472, మహిళలు 14,246 కాగా.. ఇతరులు ఇద్దరు ఉన్నారు.
137 పోలింగ్ కేంద్రాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో 15, నాగర్ కర్నూల్ జిల్లాలో 14, వనపర్తి జిల్లాలో 7, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 11, నారాయణపేట జిల్లాలో 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ జిల్లాలో 18, మేడ్చల్ లో 14 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. -మల్కాజిగిరి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలు. . ఎన్నికల నిర్వహణకు 593 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇక.. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 137 మంది పీవోలు, 137 మంది ఏపీఓలు, 319 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరిలో 146 మందిని రిజర్వ్గా నియమించారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రిసెప్షన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 12 మంది సెక్టార్ కంట్రోల్ అధికారులను నియమించారు.
Read also: Happy Birthday Kavitakka: ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా బర్త్డే విషెస్..
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జిల్లాలో 1,822 మంది ఓటర్లు ఉండగా.. 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా.. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాలలో 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇబ్రహీంపట్నంలో 207, మంచాలలో 62, యాచారంలో 85 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మరోవైపు హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఎన్నికలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ముషీరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 109వ కేంద్రంలో 7 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయులు ఓట్లు వేసేందుకు ఇప్పటికే బారులు తీరారు. పోలింగ్ సిబ్బంది సమయానికి వచ్చినప్పటికీ బ్యాలెట్ బాక్స్ సీల్ చేయడంలో జాప్యం జరగడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే.. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 333 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు.
ఏపీలోనూ ప్రశాంతంగా పోలింగ్..:
ఆంధ్రప్రదేశ్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయులు, 4 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
PM Modi: ‘నాటు నాటు’ సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది.. ప్రధాని అభినందనలు