MLC election polling: ప్రశాంతంగా కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC election polling: ప్రశాంతంగా రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం ఓటర్లలో పురుషులు 15,472, మహిళలు 14,246 కాగా.. ఇతరులు ఇద్దరు ఉన్నారు.
137 పోలింగ్ కేంద్రాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో 15, నాగర్ కర్నూల్ జిల్లాలో 14, వనపర్తి జిల్లాలో 7, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 11, నారాయణపేట జిల్లాలో 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ జిల్లాలో 18, మేడ్చల్ లో 14 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. -మల్కాజిగిరి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలు. . ఎన్నికల నిర్వహణకు 593 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇక.. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 137 మంది పీవోలు, 137 మంది ఏపీఓలు, 319 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరిలో 146 మందిని రిజర్వ్గా నియమించారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రిసెప్షన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 12 మంది సెక్టార్ కంట్రోల్ అధికారులను నియమించారు.
Also Read
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
Read also: Happy Birthday Kavitakka: ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా బర్త్డే విషెస్..
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జిల్లాలో 1,822 మంది ఓటర్లు ఉండగా.. 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా.. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాలలో 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇబ్రహీంపట్నంలో 207, మంచాలలో 62, యాచారంలో 85 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మరోవైపు హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఎన్నికలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ముషీరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 109వ కేంద్రంలో 7 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయులు ఓట్లు వేసేందుకు ఇప్పటికే బారులు తీరారు. పోలింగ్ సిబ్బంది సమయానికి వచ్చినప్పటికీ బ్యాలెట్ బాక్స్ సీల్ చేయడంలో జాప్యం జరగడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే.. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 333 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు.
ఏపీలోనూ ప్రశాంతంగా పోలింగ్..:
ఆంధ్రప్రదేశ్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయులు, 4 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
PM Modi: ‘నాటు నాటు’ సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది.. ప్రధాని అభినందనలు
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?