తెలంగాణలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్న జీవో 317ను రద్దు చేయాలని మావోయిస్టు సార్టీ లేఖ రాసింది. భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) తెలంగాణ కమిటీ లేఖ విడుదల చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలి. స్థానికత, రిజర్వేషన్ల పై ఆధారపడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఖాళీగా వున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఉద్యోగ అవకాశాలను కోల్పుతున్న నిరుద్యోగులు, విభజన ప్రక్రియ ద్వారా బలి అవుతున్న ఉద్యోగులు, యువకులు ఏకమై జీవో నెం. 317ను రద్దు చేసే వరకు పోరాడండి అంటూ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ రాశారు.
స్థానికత లేకుండా మెరిట్, సీనియార్టీ ఆధారంగా కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియ మూలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరుద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటారని భారత కమ్యూనిస్టు (మావోయిస్ట్) పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేసారు. ప్రభుత్వం అనాలోచిత చర్యలతో అన్నీ ప్రాంతాలు స్థానిక విద్యార్థులు, రిజర్వేషన్ కలిగిన ఆదివాసీ ప్రాంతాల విద్యార్థులు ఉద్యోగా అవకాశాలను కోల్పుతున్నారని లేఖ లో పేర్కొన్నారు. ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయకుండా టీఆర్ ఎస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విభజన ప్రక్రియ చేపట్టి స్థానిక నిరొద్యోగులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. ఆశాస్త్రీయంగా పద్ధతులలో కొనసాగిస్తున్న బదిలీలతో ఇప్పటికే ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని హెచ్చరించారు. ప్రభుత్వ అనాలోచిత చర్య మూలంగా ఉద్యోగులు మానసికంగానే కాకుండా, ఆర్ధికంగా కూడా ఇబ్బందులకు గురి అవుతారన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వపు అనాలోచిత చర్యను 3 లక్షలకు మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నప్పటికీ వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం పరిగణంలోకి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా, అప్రజాస్వామిక పద్ధతుల్లో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను అమలు చేస్తుందని విమర్శించారు. ఉద్యోగులతో కనీసం చర్చించకుండా బలవంతంగా అమలు పరుస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తరుపున పోరాడుతామన్నారు. ఈ అంశంపై ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు.