జీవో 317ను రద్దు చేయాలి.. మావోయిస్టు పార్టీ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్న జీవో 317ను రద్దు చేయాలని మావోయిస్టు సార్టీ లేఖ రాసింది. భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) తెలంగాణ కమిటీ లేఖ విడుదల చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలి. స్థానికత, రిజర్వేషన్ల పై ఆధారపడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఖాళీగా వున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఉద్యోగ అవకాశాలను కోల్పుతున్న నిరుద్యోగులు, విభజన ప్రక్రియ ద్వారా బలి అవుతున్న ఉద్యోగులు, యువకులు ఏకమై జీవో నెం. 317ను రద్దు చేసే వరకు పోరాడండి అంటూ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ రాశారు.

స్థానికత లేకుండా మెరిట్, సీనియార్టీ ఆధారంగా కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియ మూలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరుద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటారని భారత కమ్యూనిస్టు (మావోయిస్ట్) పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేసారు. ప్రభుత్వం అనాలోచిత చర్యలతో అన్నీ ప్రాంతాలు స్థానిక విద్యార్థులు, రిజర్వేషన్ కలిగిన ఆదివాసీ ప్రాంతాల విద్యార్థులు ఉద్యోగా అవకాశాలను కోల్పుతున్నారని లేఖ లో పేర్కొన్నారు. ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయకుండా టీఆర్ ఎస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విభజన ప్రక్రియ చేపట్టి స్థానిక నిరొద్యోగులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. ఆశాస్త్రీయంగా పద్ధతులలో కొనసాగిస్తున్న బదిలీలతో ఇప్పటికే ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని హెచ్చరించారు. ప్రభుత్వ అనాలోచిత చర్య మూలంగా ఉద్యోగులు మానసికంగానే కాకుండా, ఆర్ధికంగా కూడా ఇబ్బందులకు గురి అవుతారన్నారు.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
టీఆర్ఎస్ ప్రభుత్వపు అనాలోచిత చర్యను 3 లక్షలకు మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నప్పటికీ వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం పరిగణంలోకి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా, అప్రజాస్వామిక పద్ధతుల్లో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను అమలు చేస్తుందని విమర్శించారు. ఉద్యోగులతో కనీసం చర్చించకుండా బలవంతంగా అమలు పరుస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తరుపున పోరాడుతామన్నారు. ఈ అంశంపై ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!