మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేయడం ఏజెన్సీ ఏరియాల్లో కలకలం రేపుతుంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంత ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ లేఖ విడుదల చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. జగన్ విడుదల చేసిన లేఖ ఇప్పుడు ఇటు పోలీసులకు మింగుడు పడటం లేదు. తెలంగాణ మావోయిస్టు పార్టీని నిర్ములించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు దాడులు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.…
తెలంగాణలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్న జీవో 317ను రద్దు చేయాలని మావోయిస్టు సార్టీ లేఖ రాసింది. భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) తెలంగాణ కమిటీ లేఖ విడుదల చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలి. స్థానికత, రిజర్వేషన్ల పై ఆధారపడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఖాళీగా వున్న పోస్టులను వెంటనే భర్తీ…