Delhi Lieutenant Governor: ఢిల్లీ సీఎంపై చట్టపరమైన చర్యలు.. కేజ్రీవాల్ కు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖ రాశారు. పేదలకు ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని ఆపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులు ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గత కొన్ని వారాలుగా, ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి, ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ గవర్నర్ తీరుపై మండిపడుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సక్సేనా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆప్ నేతలు చేసిన ఆరోపణలను లెఫ్టినెంట్ గవర్నర్ కొట్టిపారేశారు. వారు చేసే ఆరోపణలు నిస్సందేహంగా తప్పుదోవ పట్టించేవే అని, పరువు నష్టం కలిగించేవి అని చెప్పారు. “నాకు వ్యతిరేకంగా ప్రభుత్వం, పార్టీలో మీరు, మీ సహచరులు చేసిన నిరాధారమైన, తప్పుడు ప్రకటనలకు సంబంధించి జవాబుదారీతనం బాధ్యతను కోరుతూ నేను మీకు లేఖ రాస్తున్నాను” అని అంటూ గవర్నర్ సక్సేనా సీఎం కేజ్రీవాల్కు లేఖలో రాశారు. పేదలకు విద్యుత్ సబ్సిడీకి నేను ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నానని, వివిధ సందర్భాల్లో వేర్వేరు ఫైళ్లపై వ్రాతపూర్వకంగా పబ్లిక్ డొమైన్లో అదే స్పష్టంగా చెప్పానని మీకు బాగా తెలుసు అని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు.
Also Read:Harish Rao : సభా వేదికగా క్షమాపణలు చెప్పిన మంత్రి హరీష్ రావు
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
లెఫ్టినెంట్ గవర్నర్ విద్యుత్ సబ్సిడీని నిలిపివేయాలని కోరుకుంటున్నారని లేదా విద్యుత్ సబ్సిడీని ఆపడానికి అధికారులు లేదా రాజకీయ పార్టీతో కుట్ర పన్నుతున్నారని నిర్ధారించే ఏదైనా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలను చూపించడంలో విఫలమైతే ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు చట్టపరమైన చర్యలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఏప్రిల్ 15 వరకు గడువు ముగిసే వరకు నిర్ణయాన్ని ఎందుకు పెండింగ్లో ఉంచారని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రశ్నించారు.
కాగా, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు తమను వేధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్పై ఆప్ నేతలు తరచూ విరుచుకుపడుతున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో సహా ఇతర బిజెపియేతర రాష్ట్రాలు కూడా అదే ఆరోపించాయి.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!