KTR: దమ్ముంటే చర్చకు రండి.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్, బీజేపీలను మంత్రి కేటీఆర్ మరోసారి టార్గెట్ చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చాలని ప్రతిపక్ష పార్టీలకు కేటీఆర్ సవాల్ విసిరారు. పంచాయత్ రాజ్ శాఖ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం మెరుగ్గా పనిచేస్తోందన్నారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిలో మాత్రం కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో వరి ఆరబెట్టే ప్లాట్ఫారమ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదని, అదే గుజరాత్లో రూ.192 కోట్లతో చేపల కోసం అనుమతించిందని కేటీఆర్ గుర్తు చేశారు.
Also Read: Fire Department: అగ్నిరేగితే ఆర్పేదెలా.. నేటి నుంచి అగ్నిమాపక శాఖ వారోత్సవాలు
కేంద్రం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లను కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. బిల్లులు క్లియర్ చేయలేదని రాజకీయ మైలేజ్ కోసం బిజెపి నాయకులు సోషల్ మీడియాలో ఈ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో రాష్ట్రం రూ. లక్ష కోట్ల నష్టాన్ని చవిచూసినా, తెలంగాణ ప్రగతి సమతుల్యంగా ఉంది అని కేటీఆర్ అన్నారు. దీనికి తోడు దేశంలోని 13 రాష్ట్రాల్లో తెలంగాణలో అవినీతి తక్కువగా ఉందని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సర్వేలో తేలిందని కేటీఆర్ చెప్పారు. అయితే ఇన్ని సాధించినా తెలంగాణపై ఆర్థిక ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి రూ.30,000 కోట్ల రుణం తీసుకునే సామర్థ్యం కావాలంటే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు సహా విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పట్టుబట్టిందని ధ్వజమెత్తారు. అయితే, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అశాస్త్రీయ నిర్ణయాన్ని వ్యతిరేకించారని చెప్పారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
Also Read:woman living atop snow: మంచు పర్వతమే ఆమె నివాసం.. మహిళలందరికీ ఆదర్శం
వ్యాపార నిర్వహణ చట్టం కింద రుణాలపై కేంద్రం కూడా ఆంక్షలు విధిస్తూనే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా పొందిన రుణాలను కూడా ఎఫ్ఆర్బిఎం చట్టం కింద చేర్చి, రాష్ట్రానికి రూ. 20,000 కోట్ల కోత విధించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో రాష్ట్రానికి 27 అవార్డులు వచ్చాయని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రశంసించిన కేటీఆర్.. గ్రీన్ కవర్లో 7.7 శాతం వృద్ధితో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రత్యేకత ఉందన్నారు. ఏడేళ్లలో జిల్లా పరిషత్లకు ఏడు, మండల పరిషత్లకు 16, గ్రామ పంచాయతీలకు 56 సహా 79 జాతీయ పంచాయతీ అవార్డులను తెలంగాణ కైవసం చేసుకుంది అని కేటీఆర్ అన్నారు. ఈ-పంచాయతీ సేవలను సమర్థవంతంగా అందజేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు సరఫరా చేయనున్నట్టు అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ ప్రకటించారు.
- Tags
- bjp
- congress
- it minister
- ktr
- telangana
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!