Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ktr Challenges Oppn To Compare Telanganas Schemes To Other States

KTR: దమ్ముంటే చర్చకు రండి.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్

Published Date :April 1, 2023 , 2:11 pm
By NTV WebDesk
KTR: దమ్ముంటే చర్చకు రండి.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్, బీజేపీలను మంత్రి కేటీఆర్ మరోసారి టార్గెట్ చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చాలని ప్రతిపక్ష పార్టీలకు కేటీఆర్ సవాల్ విసిరారు. పంచాయత్ రాజ్ శాఖ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం మెరుగ్గా పనిచేస్తోందన్నారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిలో మాత్రం కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో వరి ఆరబెట్టే ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదని, అదే గుజరాత్‌లో రూ.192 కోట్లతో చేపల కోసం అనుమతించిందని కేటీఆర్ గుర్తు చేశారు.
Also Read: Fire Department: అగ్నిరేగితే ఆర్పేదెలా.. నేటి నుంచి అగ్నిమాపక శాఖ వారోత్సవాలు

కేంద్రం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లను కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. బిల్లులు క్లియర్ చేయలేదని రాజకీయ మైలేజ్ కోసం బిజెపి నాయకులు సోషల్ మీడియాలో ఈ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో రాష్ట్రం రూ. లక్ష కోట్ల నష్టాన్ని చవిచూసినా, తెలంగాణ ప్రగతి సమతుల్యంగా ఉంది అని కేటీఆర్ అన్నారు. దీనికి తోడు దేశంలోని 13 రాష్ట్రాల్లో తెలంగాణలో అవినీతి తక్కువగా ఉందని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సర్వేలో తేలిందని కేటీఆర్ చెప్పారు. అయితే ఇన్ని సాధించినా తెలంగాణపై ఆర్థిక ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి రూ.30,000 కోట్ల రుణం తీసుకునే సామర్థ్యం కావాలంటే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు సహా విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పట్టుబట్టిందని ధ్వజమెత్తారు. అయితే, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అశాస్త్రీయ నిర్ణయాన్ని వ్యతిరేకించారని చెప్పారు.

Also Read

  • Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
  • China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
  • WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్‌లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
  • Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్

Also Read:woman living atop snow: మంచు పర్వతమే ఆమె నివాసం.. మహిళలందరికీ ఆదర్శం

వ్యాపార నిర్వహణ చట్టం కింద రుణాలపై కేంద్రం కూడా ఆంక్షలు విధిస్తూనే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా పొందిన రుణాలను కూడా ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం కింద చేర్చి, రాష్ట్రానికి రూ. 20,000 కోట్ల కోత విధించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రానికి 27 అవార్డులు వచ్చాయని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రశంసించిన కేటీఆర్‌.. గ్రీన్‌ కవర్‌లో 7.7 శాతం వృద్ధితో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రత్యేకత ఉందన్నారు. ఏడేళ్లలో జిల్లా పరిషత్‌లకు ఏడు, మండల పరిషత్‌లకు 16, గ్రామ పంచాయతీలకు 56 సహా 79 జాతీయ పంచాయతీ అవార్డులను తెలంగాణ కైవసం చేసుకుంది అని కేటీఆర్ అన్నారు. ఈ-పంచాయతీ సేవలను సమర్థవంతంగా అందజేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు సరఫరా చేయనున్నట్టు అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ ప్రకటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • it minister
  • ktr
  • telangana

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions