కొడాలి నాని మాటల్లో అంతరార్థం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడు రాజధానుల అంశం నేడు మరోసారి హాట్ టాపిక్గా మారింది. మూడు రాజధానుల అంశాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. మూడు రాజధానుల అంశంపై వాదోపవాదాలు విన్న హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ రోజు మళ్లీ హైకోర్టు ఈ విషయంపై విచారణ చేపట్టడంతో మూడు రాజధానులు అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. దీనిపై అసెంబ్లీలో కూడా చట్టాన్ని వెనక్కి తీసుకుంటారని తెలుస్తోంది.
అయితే ఇదిలా ఉండగా.. దీనిపై ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించన అనంతరం అసెంబ్లీ సమావేశాలకు ఒక్కొక్కరిగా మంత్రులు హజరవుతున్నారు. అసెంబ్లీ వద్దకు వచ్చిన మంత్రి కొడాలి నానిని మీడియా ఈ విషయంపై ప్రశ్నించగా… ‘జగన్ మోహన్రెడ్డిగారు, ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక.. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. టెక్నికల్గా కోర్టుకు పోయి.. రకరకాలుగా అంశాలు జరుగుతున్నాయి. దానిపైన ఏం చేయాలో కేబినెట్ చర్చిచాం. దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం.’ అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఆయన మాటలు విన్న కొందరు.. రాజధానుల బిల్లు మళ్లీ ప్రవేశపెట్టి శాసనమండలి అనుమతి అధికారికంగా తీసుకుంటారా..? అని అంటున్నారు. అందుకే కొడాలి నాని స్పష్టతనివ్వలేదని అంటున్నారు. ఏదేఏమైనా ఈ విషయంపై స్పష్టత రావాలంటే సీఎం జగన్ ప్రకటన చేసేవరకు వేచి చూడాల్సిందే..
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?