టీడీపీ ఓటు బ్యాంక్ అటువైపు టర్న్ కానుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండగా అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. బద్వేల్ లో వైసీపీ గెలుపు ఏకపక్షంగానే కన్పిస్తుండటంతో ఆపార్టీ భారీ మోజార్టీపై గురిపెట్టింది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని నేతలంతా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ తమ్ముళ్లు మాత్రం ఎవరికీ ఓటు వేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యమైనప్పటీ నుంచే టీడీపీ ఇక్కడ రేసులో ఉంది. వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించక ముందే టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి దాదాపు 50వేల ఓట్లు వచ్చాయి. దీంతో ఈసారి ముందుగానే టీడీపీ అభ్యర్థి బద్వేల్ నియోజవకర్గంలో ప్రచారాన్ని చేపట్టారు. అయితే అనుహ్యంగా టీడీపీ బద్వేల్ ఉప ఎన్నిక నుంచి తప్పుకొని టీడీపీ తమ్ముళ్లకు షాకిచ్చింది. మరోవైపు పోలింగ్ సమయం దగ్గరపడుతున్నప్పటికీ టీడీపీ అధిష్టానం ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనే అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
వైసీపీ తన అభ్యర్థిగా చనిపోయిన బద్వేల్ ఎమ్మెల్యే భార్య పేరునే ప్రకటించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో వైసీపీ గెలుపు ఏకపక్షమనేనే ప్రచారం జరుగుతోంది. కడప జిల్లాలో వైసీపీ బలంగా ఉండటంతో జనసేన సైతం పోటీ నుంచి తప్పుకుంది. రాజకీయ సంప్రదాయాలను గౌరవిస్తూ తాము ఈ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ వెంటనే టీడీపీ సైతం ఉప ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు.
ఈ నేపథ్యంలో బద్వేల్ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. అయితే అనుహ్యంగా కాంగ్రెస్, బీజేపీ బరిలో నిలిచాయి. ఈ పరిస్థితుల్లో ఓటింగ్ తప్పనిసరిగా మారింది. అయితే టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడం ఇక్కడ ఆపార్టీ జెండా కూడా కన్పించడం లేదు. జనసేన పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ బీజేపీకి మద్దతు ఇస్తున్న కారణంగా ఆపార్టీ జెండాలు ఇక్కడ రెపరెపలాడుతున్నాయి. ఆఖరికి కాంగ్రెస్ జెండా లు కన్పిస్తున్నాయి కానీ టీడీపీ జెండా మాత్రం కన్పించడం లేదు. దీనంతటికీ చంద్రబాబు నిర్ణయమే కారణమని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ తేదికి సమయం దగ్గర పడుతున్నా అధిష్టానం ఇంకా ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో ఇంకా తేల్చుకోలేక పోతుంది.
ఇక బీజేపీకి టీడీపీ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అలాగని కాంగ్రెస్ కు సైతం లోపాయికారిగా సహకారం అందించడం లేదు. దీంతో టీడీపీ ఓటర్లు ఎవరికీ ఓటు వేయాలో తేల్చుకోలేక సతమతవుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం టీడీపీ ఓటు బ్యాంకు సైతం అధికార పార్టీ ఖాతాలో పడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి భారీ మెజార్టీ వస్తే మాత్రం అది మళ్లీ టీడీపీకే మైనస్ గా మారనుంది. దీంతో టీడీపీ తమ ఓటు బ్యాంకును ఎటువైపు మళ్లిస్తుందనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!