రూటుమార్చిన పవన్ కల్యాణ్.. జనసేన లైన్లోని వచ్చినట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ‘ముందస్తు’ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండటం ఆసక్తిని రేపుతోంది. అధికారంలోకి ఉన్న వైసీపీ దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ ఏకం అవుతాయా? అనే చర్చ సైతం ఏపీలో జోరుగా సాగుతోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోనూ రాజకీయంగానూ ఫుల్ బీజీగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని స్వయంగా ఓటమి పాలయ్యారు. ఈక్రమంలోనే జనసేనాని కొంత సైలంట్ అయినట్లు కన్పించారు. అయితే గత కొద్దిరోజులుగా మాత్రం జనసేనాని యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైసీపీ సర్కారుపై ఢీ అంటే ఢీ అనేలా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఏపీలో ప్రతిపక్షం టీడీపీనా లేక జనసేనా పార్టీనా? అన్న చర్చ నడుస్తోంది.జనసేన ఏపీలో రోజురోజుకు తన బలాన్ని పెంచుకుంటూ పోతుందనే అభిప్రాయం కలుగుతోంది.
Also Read
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
వచ్చే ఎన్నికల నాటికి జనసేన, టీడీపీ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే వార్తలు ఇటీవలీ నుంచి బలంగా విన్పిస్తున్నాయి. ఈ పొత్తులో బీజేపీ ఉంటుంది? లేదా అన్నది పక్కన పెడితే ఈ రెండు పార్టీలు మాత్రం కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయనే సంకేతాలు బయటికి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తన సామాజికవర్గాన్ని అంతా ఏకం చేసేందుకు పావులు కదుపుతున్నారనే టాక్ విన్పిస్తోంది. ఏపీలో బలమైన శక్తిగా ఉన్న కాపులను మచ్చిక చేసుకోవడం ద్వారా రాజకీయశక్తిగా ఎదిగే ప్రయత్నం జనసేన చేస్తోంది.
టీడీపీకి తొలి నుంచి మద్దుతుగా నిలిచే కాపు సామాజిక వర్గం గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టింది. దీంతో టీడీపీ అధికారానికి దూరమైందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. జనసేనకు పోలైన ఓటింగులోనూ ఎక్కువ శాతం ఈ సామాజికవర్గానికి చెందినవారే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వర్గాన్ని జనసేన ఓన్ చేసుకోవడం ద్వారా రాజకీయంగా బలపడాలని ఆశిస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఈ సామాజికవర్గాన్ని చూపించి మరికొన్ని సీట్లు డిమాండ్ చేసే అవకాశం జనసేనకు ఉండనుంది. ఈ కారణాలన్నింటిని బేరీజు వేసుకొని ఆపార్టీ కాపులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకునేలా జనసేన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగానే కాపు రిజర్వేషన్ పై పవన్ కల్యాణ్ గళమెత్తే అవకాశం ఉండనుందని సమాచారం. అలాగే కాపుల కోసం ప్రత్యేక స్కీమ్ వంటి అంశాలపై పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. జిల్లాల వారీగా కాపులతో సమావేశాలు నిర్వహించి జనసేన పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారట. ప్రస్తుతం జనసేనాని ఫోకస్ అంతా కాపు సామాజికవర్గంపైనే ఉందని తెలుస్తోంది. మరీ పవన్ కల్యాణ్ కాపులను ఏమేరకు తనవైపు తిప్పుకుంటారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!