టోక్యో ఒలింపిక్స్: సెమీస్కు చేరిన ఇండియా మహిళల హాకీ టీమ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు దూసుకుపోతున్నది. నిన్నటి రోజున పురుషుల హాకీ జట్టు బ్రిటన్ను ఓడించి సెమీస్కు చేరుకున్నది. 3-1తేడాతో బ్రిటన్ను ఓడించి సెమీస్లో బెల్జియంతో తలపడేందుకు సిద్ధమైంది. కాగా, అదే బాటలో ఇప్పుడు మహిళల హాకీ టీమ్ కూడా పయనిస్తోంది. మహిళల హాకీ టీమ్ బలమైన ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో ఓడించి సెమీస్ కు చేరుకున్నది. మొదటి క్వార్టర్లో ఏ జట్టు కూడా గోల్ చేయలేదు. రెండో క్వార్టర్ 22 వ నిమిషం వద్ద భారత్ క్రీడాకారిణి గుర్జిత్ కౌర్ గోల్ చేసింది. దీంతో ఇండియా 1-0 లీడ్లోకి రావడంతో ఆస్ట్రేలియా జట్టు దూకుడు పెంచింది. గోల్ చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేసింది. అయితే, ఆస్ట్రేలియా ప్రయత్నాలను భారత టీమ్ సమర్ధవంతంగా నిలువరించడంతో ఇండియా జట్టు 1-0 తేడాతో విజయం సాధించి సెమీస్కు చేరుకుంది. 1980 లో జరిగిన మాస్కో ఒలింపిక్స్లో భారత మహిళల జట్టు 4వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత జరిగిన ఒలింపిక్స్లో చెప్పుకోదగిన విధంగా రాణించలేకపోయింది. కాగా, ఇప్పుడు టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్లో భారత హాకీ ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తున్నారు.
Read: రాజ్ కుంద్రా కేసు : శిల్పా శెట్టికి హీరోయిన్ సపోర్ట్
Also Read
తాజావార్తలు
-
Ghost SIM Scam: ‘ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
-
OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న ‘ఓలా ఎలక్ట్రిక్’..
-
UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
-
PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!