కోల్కతా వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు టీ20ల సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలవడం ఇది వరుసగా మూడో సారి. ఇప్పటివరకు రోహిత్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్, అశ్విన్లకు రెస్ట్ ఇచ్చిన జట్టు మేనేజ్మెంట్… ఇషాన్ కిషన్, చాహల్ను తీసుకుంది. అటు న్యూజిలాండ్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. సౌథీ స్థానంలో ఫెర్గుసన్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా మూడు టీ20ల సిరీస్ను ఇప్పటికే భారత్ 2-0 తేడాతో గెలిచి, సిరీస్ కైవసం చేసుకుంది.
తుది జట్లు
భారత్: రోహిత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, చాహల్
న్యూజిలాండ్: శాంట్నర్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, మిచెల్, చాప్మన్, ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, జేమ్స్ నీషమ్, ఆడమ్ మిల్నే, ఇష్ సోథీ, బౌల్ట్, లోకీ ఫెర్గుసన్