ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,76,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,72,400 కి చేరింది. ఇందులో 2,23,55,440మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31,29,878 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,874 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,87,122 కి చేరింది. ఇక 24 గంటల్లో 3,69,077 మంది కరోనా నుంచి కోలుకున్నారు.