కుప్పంలో టీడీపీకి ఊరట లభించేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రవ్యాప్తంగా ఒక నగర పంచాయతీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వంత నియోజకవర్గంలో ఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. తాజాగా హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభించింది. కుప్పం నగర పంచాయితీ ఎన్నికల్లో ప్రచారంపై స్థానిక డీఎస్పీ విధించిన ఆంక్షలను తప్పు పట్టింది హైకోర్టు. తన అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ ఇచ్చిన సర్క్యులర్ని కొట్టిపారేసింది హైకోర్ట్.
ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ ఆంక్షలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు టీడీపీ నేతలు, ఈ పిటీషన్పై వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు… పలు అభ్యంతరాలను కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులను కాల రాస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు పోసాని.
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
టీడీపీ నేత పులివర్తి నాని, నిమ్మల రామానాయుడు, మునిరత్నం, అమర్నాథ్ రెడ్డి ప్రచారానికి ఆటంకాలు కల్పించవద్దని కోరగా ఆ మేరకు ఏపీ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ప్రచారం చేసుకోవడం పార్టీ నేతల ప్రాథమిక హక్కు అని వాదించారు న్యాయవాది పోసాని. ఇక కుప్పం ఎన్నికల ప్రచారం క్రమంగా వివాదంగా మారుతోంది. కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులను అధికారులు అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. కుప్పంలో వున్న ఇతర ప్రాంతాల టీడీపీ నేతలను అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీడీపీ నేతలు నిరసనలకు దిగారు.
ఇదిలా వుంటే.. కుప్పం నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలపై పోలీసుల వేధింపులు కొనసాగుతూనే వున్నాయి. తనిఖీల పేరుతో టీడీపీ శ్రేణులపై పోలీసులు ఆంక్షలు పెట్టి అడ్డుకుంటున్నారు. ప్రచారానికి సైతం అనుమతులు తీసుకోవాలంటూ ఆంక్షలు పెట్టి టీడీపీ అభ్యర్థులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు.
వైసీపీ ప్రచారానికి మాత్రం ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా పోలీసులే సహాయ సహకారాలు అందిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఎన్నికల సంఘం తమ ఫిర్యాదులపై స్పందించడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ కంచుకోటలాంటి కుప్పంను ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. నామినేషన్లు వేసిన వారికి బలవంతంగా విత్ డ్రా చేయించారని టీడీపీ ఆరోపించింది. అధికారబలంతో తమ పార్టీ నేతల్ని వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!