హర్యానాలో కొనసాగుతున్న రైతుల ఆందోళన… ఈనెల 27న భారత్ బంద్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ నుంచి గతంలో పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. అటు ఉత్తర ప్రదేశ్ నుంచి కూడా రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేశారు. ఇప్పుడు రైతులు బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. కర్నాల్ లో రైతులు రోడ్డు మీదకు చేరుకొని నిరసనలు చేస్తున్నారు. దీంతో కర్నాల్లో ఇంటర్నెట్ను నిలిపివేసింది ప్రభుత్వం. రైతు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి. త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీని ఒడించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈనెల 27 వ తేదీన భారత్ బంధ్ను నిర్వహించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. చాలా కాలంగా రైతు సంఘాలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నా కేంద్రం దిగిరావడం లేదు. రైతు చట్టాల్లో కొన్ని సవరణలు చేసేందుకు ఇప్పటికే కేంద్రం ఒప్పుకున్న సంగతి తెలిసిందే.
Read: వినాయక చవితి ఎఫెక్ట్: ఆ నగరంలో మాంసం విక్రయాలపై నిషేదం…
Also Read
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!