యూకే వర్సెస్ భారత్.. వ్యాక్సిన్ రగడ కొలిక్కి వచ్చేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొవీషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో యూకే వర్సెస్ భారత్ అన్నట్లుగా తాజాగా పరిస్థితులు మారిపోయాయి. కొవీషీల్డ్ టీకా తయారు చేసింది బ్రిటన్ దేశానికి చెందిన కంపెనీయే అయినప్పటికీ కూడా ఆదేశం భారతీయుల విషయంలో అవలంభిస్తున్న విధానం విమర్శలకు తావిస్తోంది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ బ్రిటన్ కు వచ్చే భారతీయులు క్వారంటైన్లో ఉండాలంటూ ఆదేశం ప్రకటించడం విడ్డూరంగా మారింది. దీనిని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతుండటంతో కేంద్ర సర్కారు సైతం దీనిపై రియాక్ట్ అయింది.
యూకే విధానం సరైందని కాదని వెంటనే ఈ ప్రకటనను బ్రిటన్ ఉపసంహరించుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. లేనట్లయితే ఇదే విధానాన్ని యూకే విషయంలోనూ భారత్ అవలంభించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇది మూమ్మాటికి కక్ష్య్యపూరితంగా ఉందంటూ స్పందించింది. వీలైనంత త్వరగా ఈ వివాదానికి బ్రిటన్ ఫుల్ స్టాప్ పెట్టేలా చూడాలని కేంద్ర విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ సూచించారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
యూకే ఇటీవల నూతన ప్రయాణ విధానాలపై ఓ ప్రకటన చేసింది. దీనిలో భాగంగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారత్, మరికొన్ని దేశాల ప్రయాణీకులు సైతం క్వారంటైన్లో ఉండాలని పేర్కొంది. వీరంతా తమ ప్రయాణానికి ముందుగా.. బ్రిటన్ చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. పదిరోజులపాటు స్వీయ నిర్భంధంలో ఉండాలని స్పష్టం చేసింది.
ఈ నిబంధనలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, శశిథరూర్ తప్పుబట్టారు. యూకే నిబంధనలు జాతి వివక్షతను పెంచేలా ఉన్నాయని.. ఇది మూమ్మాటికి నేరపూరిత చర్యేనని వారు దుయ్యబట్టారు. కాగా కొవీషీల్డ్ టీకా వాస్తవానికి యూకేకు చెందిన సంస్థదే. అంతేకాకుండా యూకే అభ్యర్థన మేరకే భారత్ 50లక్షల కొవీషీల్డ్ డోసులను భారత్ ఆ దేశానికి సరఫరా చేసింది.
ఆ దేశంలోనూ ఈ టీకాలను ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చింది. అలాంటిది యూకే మాత్రం కొవీషీల్డ్ టీకాను గుర్తించకుండా తాజాగా ప్రకటన చేయడం వివక్షపూరితమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ల విధానంలో అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి.
అయితే యూకే మాత్రం తమ భాగస్వామ్య దేశాలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు విడుదల చేయడాన్ని భారత్ తప్పుబడుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే భారత్… యూకే విదేశాంగ దృష్టికి తీసుకెళ్లింది. ఈ వివాదానికి వీలైనంత త్వరగా పరిష్కరించాలని చూపాలని కోరింది. లేనట్లయితే బ్రిటన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!