Khairatabad Ganesh: ఈ ఏడాది ‘బడా గణేష్’ హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?
- ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం రూ. 70 లక్షలు
- హోర్డింగులు ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో 40 లక్షలు సమకూరినట్టు సమాచారం
- ఆన్లైన్ ద్వారా గణపతి చెంతన ఏర్పాటు చేసిన స్కానర్ల (గూగుల్ పే) ద్వారా విరాళాలు
- మొట్టమొదటిసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగనున్న హుండీ లెక్కింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
9 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్నారు. అందుకోసం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 9 గంటలకు ఖైరతాబాద్ మహా గణనాధుడికి మహా హారతి కార్యక్రమం నిర్వహించి.. 11.30 గంటలకు కలశం పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత.. రాత్రి 12 గంటల లోపు గణనాథుడిని కదిలిస్తారు. రేపు ఉదయం 7 గంటలకే గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. అయితే.. ఈ 9 రోజులు గణనాథుడికి ఘనంగా పూజలు చేశారు. అంతేకాకుండా.. భారీ సంఖ్యలో వచ్చి భక్తులు గణేషుడిని దర్శించుకున్నారు. కేవలం నగరంలో ఉండే వారే కాకుండా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీ నుంచి కూడా గణనాథుడిని దర్శించుకున్నారు.
Memorial Meet: సెప్టెంబర్ 21న హైదరాబాద్లో సీతారాం ఏచూరి సంస్మరణ సభ..
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
దర్శనానికి వచ్చిన భక్తులు.. దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో.. భక్తులు ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 70 లక్షలు కానుకల ద్వారా హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. అలాగే.. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు సమకూరినట్టు సమాచారం.. అంతేకాకుండా.. ఆన్లైన్ ద్వారా, గణపతి చెంతన ఏర్పాటు చేసిన స్కానర్ల (గూగుల్ పే) ద్వారా కూడా కొంత విరాళాలు వచ్చాయి.. వాటిని లెక్కించాల్సి ఉంది. కాగా.. హుండీ లెక్కింపును సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగనుంది. ఖైరతాబాద్లో గణపతి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి మొట్టమొదటిసారి హుండీ లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగడం విశేషం.
Knife Attack: సముద్రం తీరంలో కత్తులతో దాడి.. తీవ్రగాయాలతో వ్యక్తి మృతి
మరోవైపు.. బడా గణేష్ను దర్శించుకునేందుకు చివరి రోజు కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. దీంతో వెల్డింగ్, కర్ర తొలగింపు పనులకు ఆటంకం కలుగుతుంది. భక్తులను రోప్ సహాయంతో ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద నుంచి పంపించేస్తున్నారు పోలీసులు. మరోవైపు.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!