Booster Dose: అందరికీ బూస్టర్ డోస్.. ఎల్లుండి నుంచే పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే విస్తృతంగా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ టీకాలు పంపిణీ జరగగా.. మరోవైపు బూస్టర్ డోస్ పంపిణీపై కూడా ఫోకస్ పెట్టింది కేంద్రం.. ఇప్పటివరకు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్లైన్ కార్మికులు మరియు 60+ ఏజ్ గ్రూప్ వారు ఇలా 2.4 కోట్ల కంటే ఎక్కువ మందికి బూస్ట్ డోస్ పంపిణీ జరగగా.. ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. అందరికీ వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. అందులో భాగంగా 18 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ 19 బూస్టర్ డోస్ పంపిణీ చేపట్టనున్నారు.. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వేయనున్నారు..
Read Also: Supreme Court: ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు.. సుప్రీం కీలక నిర్ణయం
Also Read
- PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
- Modi-Trump: జీ7 వేదికగా మోడీతో దిగిన ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
- Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో ఇజ్రాయెల్కు నష్టమే.. రాయబారి రూవెన్ అజార్ కీలక వ్యాఖ్యలు
- US: న్యూయార్లో విషాదం.. గుర్రపు బండి పైనుంచి పడి భారతీయ యువకుడు మృతి
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏప్రిల్ 10 నుండి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ -19 బూస్టర్ డోస్ అందుబాటులో ఉంటుందని ఈ రోజు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. ఇదిలా ఉండగా, ఫస్ట్ మరియు సెకండ్ డోసుల కోసం ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా ఉచిత టీకా కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.. 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుని తొమ్మిది నెలలు పూర్తి అయిన తర్వాత బూస్టర్ డోస్కు అర్హులు. ఆదివారం నుంచి అన్ని ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్లైన్ కార్మికులు, 60 ఏళ్లు పైబడినవారు 2.4 కోట్ల కంటే ఎక్కువ ముందు బూస్టర్ డోసు తీసుకున్నారు.. దేశంలోని మొత్తం జనాభాలో 15 ఏళ్లు పైబడినవారిలో 96 శాతం మంది కనీసం ఒక కోవిడ్ వ్యాక్సిన్ డోస్ను పొందారు, 15 ఏళ్లు దాటిన జనాభాలో 83 శాతం మంది రెండు డోస్ల వ్యాక్సిన్ తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
-
PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
-
TGPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల.!
-
Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
ట్రెండింగ్
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!