కాంగ్రెస్కు జీ 23 ఎఫెక్ట్: త్వరలో ఆ నిర్ణయం తీసుకోకుంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయకముందు ఆ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా బయటకు రాలేదు. ఎప్పుడైతే అమరీందర్ సింగ్ రాజీనామా చేశారో అప్పటి నుంచి అంతర్గత కలహాలు బగ్గుమన్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సిద్ధూ ఆ పదవికి రాజీనామా చేయడంతో మరో డ్రామా నడిచింది. కొత్త ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు నచ్చడం లేదని, తాన రాజీనామా విషయంలో పునరాలోచన లేదని చెప్పిన సిద్ధూ, ఆ తరువాత మనసు మార్చుకున్నారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానికి సీనియర్లు ఒకసారి లేఖ రాశారు. ఇప్పుడు జీ 23 పేరుతో సీనియర్లు మరోసారి లేఖ రాశారు. వివిధ రాష్ట్రాల్లో ఎదురౌతున్న సమస్యలను పరిష్కరించడానికి వెంటనే సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ సైతం కాంగ్రెస్ నిర్ణయాలపై విమర్శలు చేశారు. జీ 23 అంటే జీ హుజూర్ 23 కాదని, కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకుండా నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. త్వరలోనే సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
Read: అక్టోబర్ 1, శుక్రవారం దినఫలాలు
Also Read
- Tags
- Congress Party
- CWC
- G 23
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!