చలికాలం తీవ్రరూపం దాలుస్తోంది. తెలంగాణలో చలి తన విశ్వరూపం చూపిస్తోంది. డిసెంబర్ రెండవ వారంలోనే పరిస్థితి ఇలా వుంటే.. రాను రాను వాతావరణం మరింత చల్లగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ యూ లో 13.1 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి.

గిన్నె దరిలో 13.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 13.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బజార్ హత్నూర్ లో 13.3 డిగ్రీలు, బోరాజ్ లో 14.1, నిర్మల్ జిల్లా పెంబిలో 14.6 కనిష్ఠఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజులో చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చలి పెరగడంతో చలిమంటలు కాగుతున్నారు జనం. ఉదయం 8 గంటలు అవుతున్నా సూర్య కిరణాలు తాకకపోవడంతో కూలీలు, ఉదయం పూట ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మఫ్లర్లు, స్వెట్టర్లకు బాగా గిరాకీ పెరిగింది.
