హుజురాబాద్ బై పోల్.. ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్న కేసీఆర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి ఫోకస్ నెలకొంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ హుజూరాబాద్ ఉప ఎన్నికపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో హుజూరాబాద్ లో ఎవరు జెండా ఎగురవేస్తారా? ఆసక్తి నెలకొంది. పోలింగ్ సమయంలో దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అయితే ప్రచారం ముగింపు రోజున సీఎం కేసీఆర్ తనదైన స్టైల్లో ఓటర్లను ఆకట్టుకునేలా భారీ బహిరంగ నిర్వహించి ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు రెడీ అవుతుండటం ఆసక్తిని రేపుతోంది.
హూజూరాబాద్ లో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారింది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ తరుఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ పెద్దలు ఈటలకు అన్నిరకాల సహకారం అందిస్తున్నారు. దీంతో బీజేపీ ప్రచారంలో దూసుకెళుతోంది. ఇక టీఆర్ఎస్ తరుపున మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను భుజాన మోస్తున్నారు. మంత్రులు గుంగుల కమాలకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు స్థానికంగా ఉంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read
- RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
- Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి
- X Down: ‘ఎక్స్’కు అంతరాయం.. లక్షలాది మంది యూజర్లకు ఇక్కట్లు
- Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
మంత్రి కేటీఆర్ తోపాటు పలువురు ముఖ్యనేతలు హుజూరాబాద్లో స్టార్ క్యాంపెనర్లుగా ఉన్నారు. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో వీరంతా రంగంలోకి దిగి టీఆర్ఎస్ లో జోష్ నింపేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారం చివరి రోజున సీఎం కేసీఆర్ తనదైన స్టైల్లో ముగించనున్నారని తెలుస్తోంది. ఈనెల 30న పోలింగ్ తేది ఉండగా 72గంటల ముందుగానే హుజూరాబాద్ లో ప్రచారాన్ని ముగించాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పర్యటన ఈనెల 27న ఖరారైంది. ఈ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ప్రచారంలో ఆయన ఏం మాట్లాడుతారనే ఆసక్తి నెలకొంది.
హుజూరాబాద్ లోని ఓటర్ల మనోగతం తెలుసుకునేలా టీఆర్ఎస్ ఇప్పటికే రెండుసార్లు సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని సమాచారం. దాదాపు 13శాతం ఓట్ల లీడ్ టీఆర్ఎస్ కు ఉందని తేలడంతో సీఎం కేసీఆర్ ప్రచారానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ రాక ఖరారు కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. గతంలో మాదిరిగానే సీఎం కేసీఆర్ ఓటర్లపై వరాలవర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తనదైన స్టైల్లో సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ప్రచారాన్ని ముగించేందుకు సిద్ధమవుతుండటం ఉత్కంఠతను రేపుతోంది.
తాజావార్తలు
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!