Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hockey World Cup 2026: FIH మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. పూల్ డిలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 6-1 తేడాతో ఘన విజయం సాధించింది. మూడు క్వార్టర్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా వరుస గోల్స్తో మ్యాచ్ను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది.
తొలి క్వార్టర్లో భారత్ బోణీ
మ్యాచ్ ప్రారంభం నుంచే భారత క్రీడాకారిణులు దూకుడుగా ఆడారు. 11వ నిమిషంలో సునీలిత టోప్పో ఫీల్డ్ గోల్తో భారత్ ఖాతా తెరిచింది. అనంతరం 17వ నిమిషంలో నవనీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 2-0కి పెంచింది. 25వ నిమిషంలో సుశీల చాను పెనాల్టీ కార్నర్ను గోల్గా మార్చడంతో భారత్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లో భారత జట్టు మరింత దూకుడు పెంచింది. 38వ నిమిషంలో దీపికా సెహ్రావత్ ఫీల్డ్ గోల్ చేసి స్కోరును 4-0కి చేర్చింది. 44వ నిమిషంలో లాల్రెమ్సియామి మరో గోల్ సాధించింది. ఆ వెంటనే 45వ నిమిషంలో సాక్షి రాణా అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ 6-0 భారీ ఆధిక్యంలో నిలిచింది. దీంతో మూడో క్వార్టర్ ముగిసే సమయానికి మ్యాచ్పై భారత్ పూర్తి పట్టు సాధించింది.
Also Read
- Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
- IND vs AFG T20: వైభవ్తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
చివరి క్వార్టర్లో దక్షిణాఫ్రికా ఒక్క గోల్
చివరి 15 నిమిషాల్లో దక్షిణాఫ్రికా గోల్ కోసం ప్రయత్నించింది. 55వ నిమిషంలో కైలా డి వాల్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి తమ జట్టు ఖాతాలో తొలి గోల్ నమోదు చేసింది. అయితే ఆ తర్వాత మరో గోల్ చేయలేకపోవడంతో భారత్ 6-1 తేడాతో విజయం సాధించింది. ఇక, దక్షిణాఫ్రికాపై భారీ విజయంతో భారత్ పూల్ డి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే తదుపరి మ్యాచ్ ఫలితం భారత్కు కీలకం కానుంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోవడంతో టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఇంగ్లాండ్తో కీలక పోరు
ప్రపంచకప్ తొలి రౌండ్లో భారత్కు ఇప్పుడు ఇంగ్లాండ్తో మ్యాచ్ మిగిలి ఉంది. ఆగస్టు 20న జరిగే ఈ మ్యాచ్లో భారత్ కనీసం డ్రా సాధిస్తే రెండో పూల్ రౌండ్కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. చైనాతో డ్రా ద్వారా సాధించిన పాయింట్ కూడా భారత్కు కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
-
Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
-
Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
-
KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!