జల జగడం.. సీజేఐ ఎన్వీ రమణ కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… లేఖలు, ఫిర్యాదులు, ఆరోపణలు, విమర్శలు.. ఇలా చివరకు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. జల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు సీజేఐ.. తెలుగు రాష్ట్రాల మధ్య కలహాలు వద్దన్న ఆయన.. అంతేకాదు మూడోపక్షం జోక్యం అవాంఛనీయం అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదంపై విచారణలో భాగంగా ఈ కామెంట్లు చేశారు జస్టిస్ రమణ.. ఇక, ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. మధ్యవర్తిత్వం ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని సీజే సూచించారు. రెండు రాష్ట్రాలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్నారు… రెండు రాష్ట్రాలకు చెందిన సీనియర్ లాయర్లు మధ్యవర్తిత్వంపై జోక్యం చేసుకోవాలని సీజేఐ సూచించారు.
కాగా, తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది.. మంచినీరు, సాగునీరు ప్రయోజనాల కోసం.. తమకు న్యాయబద్ధమైన వాటాకోసం తెలంగాణ నిరాకరిస్తోందనేది ఆంధ్రప్రదేశ్ ఆరోపణ.. శ్రీశైలం డ్యామ్ ద్వారా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా నీటిని వినియోగిస్తోందంటోంది ఏపీ.. దీంతో.. రిజర్వాయర్లో నీటిపరిణామం తీవ్రంగా తగ్గిందని చెబుతోంది.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఇప్పటికే తెలంగాణను కోరింది ఏపీ.. అయితే, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తుండడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ.. తెలుగు ప్రజల మధ్య కలహాలు వద్దన్న ఆయన.. తాను న్యాయపరమైన అంశాల విచారణలోకి వెళ్లదలచుకోలేదన్నారు.. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వాడిని.. తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారానికి సిద్ధపడినట్లైతే సమాఖ్యస్పూర్తికి, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఈ వివాద పరిష్కారానికి తోడ్పాటు అందిస్తా.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరుల జోక్యంతో న్యాయపరంగా దీన్ని పరిష్కరించుకోవాలనుకుంటే మాత్రం.. ఈ కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామని.. మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యమైతేనే తను ఈ విషయాన్ని చేపడతానన్నారు.
Also Read
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!