APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APL 2026: ఏపీఎల్ 2026 సీజన్-5లో అమరావతి రాయల్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో రోజు తొలి మ్యాచ్లో తుంగభద్ర వారియర్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమష్టి ప్రదర్శన కనబర్చిన అమరావతి జట్టు 9 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సునాయాస విజయాన్ని అందుకుంది.
మ్యాచ్లో టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన తుంగభద్ర వారియర్స్కు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. అమరావతి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తుంగభద్ర బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. పవర్ప్లే ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి కేవలం 41 పరుగులే చేయగలిగారు. ఇన్నింగ్స్ మొత్తం తుంగభద్ర జట్టు సరైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైంది. వరుసగా వికెట్లు కోల్పోతూ 15.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు నమోదు చేయగలిగారు. అమరావతి బౌలర్లలో టోషిత్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్ను కుదేలు చేశాడు. యశ్వంత్ వెంకట్, శశికాంత్ బండారు, అయ్యప్ప చెరో రెండు వికెట్లు తీసి తుంగభద్ర జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇక, 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి రాయల్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. పవర్ప్లేలోనే వేగంగా పరుగులు సాధించి విజయానికి బాటలు వేసుకుంది. తుంగభద్ర బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అమరావతి బ్యాటర్లు మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశారు. ఎస్వీ రాహుల్ 21 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరోవైపు వై సందీప్ కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. అతను నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. వీరిరువురి దూకుడు బ్యాటింగ్తో అమరావతి రాయల్స్ 11 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో 9 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించి సీజన్లో తమ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్లో అద్భుత బౌలింగ్తో తుంగభద్ర వారియర్స్ను కంగుతినిపించిన టోషిత్ యాదవ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆయనకు అవార్డును అందజేశారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!