PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- కాంగ్రెస్పై ధ్వజమెత్తిన ప్రధాని మోడీ..
- కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు..
- ‘‘హిందూ గ్రోత్ రేట్’’గా పిలువడంపై ఆగ్రహం..
- నిజానికి కాంగ్రెస్ గ్రోత్ రేట్ అంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఢిల్లీలో మిత్రపక్షాలు ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని కొనియాడాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు. భారతదేశంలో మందకొడి వృద్ధిరేటను ‘‘హిందూ గ్రోత్ రేట్’’గా పిలిచారని, అది వాస్తవానికి ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’ అంటూ దుయ్యబట్టారు. విధానపరమైన, పాలనాపరమైన వైఫల్యాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని నిస్సాహయ దుస్థితిలోకి నెట్టేశాయని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలన వారసత్వం నుంచి దేశాన్ని ఎన్డీయే ప్రభుత్వం విముక్తి చేసిందని మోడీ చెప్పారు. 12 ఏళ్ల ఎన్డీయే పాలనలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన నుంచి దేశం విముక్తి పొందిందని, వేగవంతమైన అభివృద్ధి సాధ్యం కాదని ప్రజల్ని నమ్మించాలరని, చాలా తెలివిగా దానికి హిందూ గ్రోత్ రేట్ అని పిలిచారని మండిపడ్డారు. విధానపరమైన వైఫల్యాలకు బాధ్యత తీసుకోవడం మానేసి, దానిని దేశంలో మెజారిటీ వర్గంపై నిందలు వేసేలా హిందూ గ్రోత్ రేట్ అనే భావనను ప్రచారం చేశారని అన్నారు. పనితీరు, బాధ్యత, వైఫల్యాలు అన్నీ కాంగ్రెస్వే అని, కానీ అపవాదు మాత్రం దేశంలోని హిందూ జనాభాపై నెట్టారని అన్నారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టాక దేశ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని ప్రధాని అన్నారు. సరైన ఉద్దేశంతో పనిచేస్తే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని నిరూపించామని, దీనిని దేశ ప్రజలు చూశారని అన్నారు. ఎన్డీయే పనితీరుతో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని మోడీ తెలిపారు. ఇది తమ ప్రభుత్వ విధానాలు సరైన దిశలో ఉన్నాయనే దానిని నిదర్శనమని చెప్పారు. ఈ విజయం వ్యక్తిగతం కాదని, ఎన్డీయే కుటుంబం మొత్తం సాధించిన విజయమని ప్రధాని అన్నారు.
అసలు ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అంటే ఏమిటి.?
‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అనే పదాన్ని ఆర్థిక శాస్త్రవేత్త రాజ్కృష్ణ 1978లో ఉపయోగించారు. స్వాతంత్య్రం తర్వాత 1950 నుంచి 1980ల వరకు భారత జీడీపీ వృద్ధిరేటు సుమారు 3.5%–4% మాత్రమే ఉండేది. అయితే, ఈ నెమ్మదైన వృద్ధిరేటనున సూచించడానికి ఈ పదాన్ని వాడారు. ‘‘తక్కువతో సంతృప్తి పడే హిందూ జీవనశైలి’’ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోలేదు అనే భావనను తీసుకువచ్చారు.
ఇప్పుడు ఈ పదమే వివాదానికి కారణమైంది. ఆర్థిక వృద్ధి నెమ్మదికి హిందువుల సంస్కృతి కారణం కాదని, నిజానికి దీనికి కారణం ప్రభుత్వం విధానాలు, భారీగా ప్రభుత్వ నియంత్రణ, నిర్బంధ నియామాలు కారణమని ఆర్థికవేత్తలు ఎత్తిచూపారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిని ఒక మతానికికి ఆపాదించడం అన్యాయమని చెప్పారు. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించిన తర్వాత వృద్ధి పుంజుకుంది. అప్పటి నుంచి ఈ ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అనేది పాత పదంగా మారింది. అయితే, 2023లో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ భారతదేశం ప్రమాదకరంగా ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’కు దగ్గరగా ఉందని అన్నారు. ఈయన వ్యాఖ్యలు అనేక మంది ఆర్థిక వేత్తల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాయి. ఎస్బీఐ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ మాట్లాడుతూ.. దీనిని తప్పుడు అంచనాగా, పక్షపాతపూరిత వ్యాఖ్యగా విమర్శించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?