జల జగడం.. సీజేఐ ఎన్వీ రమణ కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… లేఖలు, ఫిర్యాదులు, ఆరోపణలు, విమర్శలు.. ఇలా చివరకు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. జల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు సీజేఐ.. తెలుగు రాష్ట్రాల మధ్య కలహాలు వద్దన్న ఆయన.. అంతేకాదు మూడోపక్షం జోక్యం అవాంఛనీయం అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదంపై విచారణలో భాగంగా ఈ కామెంట్లు చేశారు జస్టిస్ రమణ.. ఇక, ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. మధ్యవర్తిత్వం ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని సీజే సూచించారు. రెండు రాష్ట్రాలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్నారు… రెండు రాష్ట్రాలకు చెందిన సీనియర్ లాయర్లు మధ్యవర్తిత్వంపై జోక్యం చేసుకోవాలని సీజేఐ సూచించారు.
కాగా, తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది.. మంచినీరు, సాగునీరు ప్రయోజనాల కోసం.. తమకు న్యాయబద్ధమైన వాటాకోసం తెలంగాణ నిరాకరిస్తోందనేది ఆంధ్రప్రదేశ్ ఆరోపణ.. శ్రీశైలం డ్యామ్ ద్వారా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా నీటిని వినియోగిస్తోందంటోంది ఏపీ.. దీంతో.. రిజర్వాయర్లో నీటిపరిణామం తీవ్రంగా తగ్గిందని చెబుతోంది.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఇప్పటికే తెలంగాణను కోరింది ఏపీ.. అయితే, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తుండడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ.. తెలుగు ప్రజల మధ్య కలహాలు వద్దన్న ఆయన.. తాను న్యాయపరమైన అంశాల విచారణలోకి వెళ్లదలచుకోలేదన్నారు.. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వాడిని.. తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారానికి సిద్ధపడినట్లైతే సమాఖ్యస్పూర్తికి, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఈ వివాద పరిష్కారానికి తోడ్పాటు అందిస్తా.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరుల జోక్యంతో న్యాయపరంగా దీన్ని పరిష్కరించుకోవాలనుకుంటే మాత్రం.. ఈ కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామని.. మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యమైతేనే తను ఈ విషయాన్ని చేపడతానన్నారు.
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
-
Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్లో మెగా బ్రదర్స్ .. చిరు – బాబి మూవీ ఓపెనింగ్లో ‘మెగా’ హ్యాపీనెస్
-
Ajinkya Rahane: “మా విజయ రహస్యం ఇదే”.. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!