మొన్న 2 వేల కోట్లు.. తాజాగా 1438 కోట్లు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్థికంగా కుదురుకునేందుకు కేంద్రం మరో అవకాశం కల్పించింది. అప్పులపై ఆధారపడుతూ అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు.. మరో ఉతం అందింది. వచ్చింది చిన్నదైనా.. కనీసం నెలో.. రెండు నెలలో మెయింటైన్ చేయగలిగేలా.. ఆర్థిక వనరులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చుకుంటోంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి 2 వేల కోట్ల రూపాయలను అప్పు రూపంలో జగన్ ప్రభుత్వం అందిపుచ్చుకుంది.
తాజాగా.. కేంద్రం ఏపీకి 1438 కోట్ల రూపాయలను అందించింది. రెవెన్యూ లోటును భర్తీ చేసే ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ నిధులు అందించింది. 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులతో కలిసి మొత్తంగా 8628 కోట్ల రూపాయల నిధులు అందించినట్టు వెల్లడించింది. అలాగే.. తాజా కోటాలో మరో 17 రాష్ట్రాలకు 9871 కోట్ల రూపాయలు అందించినట్టుగానూ వివరణ ఇచ్చింది.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
కేంద్రం ఎలాంటి సందర్భంలో నిధులు మంజూరు చేసినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఇది చాలా విలువైన సహాయంగా చూడాల్సిందే. ప్రతి రూపాయి కీలకం అవుతున్న నేటి తరుణంలో.. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలకు ఈ నిధులు ఎంతో కొంత సహాయంగా నిలిచేవే. వీటితో పాటుగా.. మరింత సంఖ్యలో నిధులు లేదంటే రుణాలు సాధించేందుకు ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వివరించారు. ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ సైతం.. తన స్థాయిలో నిధుల సమీకరణకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. కేంద్రం నుంచి నిధులు రాష్ట్రానికి వస్తున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం అండ ఇలాగే కొనసాగితే.. రాష్ట్రానికి మంచిదే అని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి