Karnataka elections: కర్ణాటక ఎన్నికల్లో సరికొత్త వ్యూహం.. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలకు రెడీ అయ్యాయి. దశల వారిగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే, అధికార బీజేపీ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం కొందరు ఎమ్మెల్యేలకు న్యాయస్థానాలు వరుసగా షాక్లు ఇస్తున్నాయి. మే 10న రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నా్యి. ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది కాషాయ పార్టీ.
Also Read:Paper Leak: వికారాబాద్ లో పదో తరగతి పరీక్ష పత్రం లీక్!
Also Read
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
కర్ణాటకలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఆసక్తిగా ఉన్న బీజేపీ, మే 10న జరిగే ఎన్నికల్లో అత్యధికంగా గెలుపొందే అభ్యర్థులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మినీ పోల్స్ను ప్రారంభించింది. అధికార పార్టీ కర్నాటక అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అది ప్రణాళికాబద్ధంగా ఉందని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలపై నిర్ణయాలు తీసుకునే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఏప్రిల్ రెండో వారంలో సమావేశం కానుంది. నామినేషన్ ప్రక్రియకు దగ్గర్లోనే పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అసంతృప్తులు, టికెట్ దక్కని వారు పార్టీ మారే అకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంచి సమయం కోసం బీజేపీ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:CM YS Jagan: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
వేచి చూసే వ్యూహంతో ఉన్న బిజెపి.. కాంగ్రెస్ , జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థుల జాబితాలపై నిఘా ఉంచింది. ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రటకించిన తర్వాత తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతే కాదు ప్రతి నియోజకవర్గంలో అంతర్గత సర్వేలు కూడా సిద్ధం చేస్తోంది. రెండు వారాల క్రితం ప్రారంభమైన కసరత్తులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక నేతలు ముగ్గురు ఉత్తమ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. వారికి ఓటింగ్ స్లిప్పులు అందజేసి తమ ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు.
Also Read:Anasuya: ఆంటీ వివాదంపై అనసూయ రియాక్షన్.. కోపానికి కారణం అదే!
బ్యాలెట్ బాక్సులను బెంగళూరుకు తీసుకువచ్చారు. ఫలితాల ఆధారంగా, ప్రతి నియోజకవర్గానికి మూడు అగ్ర పేర్లు ఉన్నాయి. అంతర్గత సర్వేలు, ఒపీనియన్ పోల్స్తో ఈ పేర్లు సరిపోయాయి. జిల్లాల వారీగా పేర్లపై చర్చించేందుకు రాష్ట్రంలోని బీజేపీ కోర్ గ్రూప్ వారాంతంలో సమావేశమైంది. అభ్యర్థులు ఇమేజ్, గెలుపు, తిరస్కరణ (అధికార వ్యతిరేకత ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేను వదులుకోవచ్చా) అనే అంశాలపై అంచనా వేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
కర్నాటకలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో కొట్టుమిట్టాడుతోంది. అవినీతి కేసులను ఎదుర్కోని క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తోంది. గెలుపు కోసం, ప్రత్యర్థి కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థులను తిప్పికొట్టడానికి బిజెపి ప్రణాళికలు రచిస్తోంది. పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనున్నారు. కాగా, కర్ణాటకలో మే 10న ఒకే దశలో పోలింగ్ జరగనుంది, మూడు రోజుల తర్వాత ఫలితాలు వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!