Paper Leak: వికారాబాద్ లో పదో తరగతి పరీక్ష పత్రం లీక్!
తెలంగాణలో పరీక్ష పేపర్ల లీకు రాయుళ్ల విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుకుంటున్నారు. పబ్లీక్ పరీక్షలు అంటే చాలు.. లీకు రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పేపరును ముందుగానే లీక్ చేసి.. పరీక్షల కోసం 24 గంటలూ కష్టపడి చదువుతున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. ఈ లీకులకు అడ్డుకుట్ట మాత్రం వేయడం లేదు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఓ వైపు పరీక్ష కొనసాగుతుండగా.. తాజాగా పేపర్ లీకేజ్ కలకలం రేపుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రశ్నపత్రం లీకు కలకలం రేపింది.
Also Read : Balagam: అద్భుతాలు సృష్టించడం ఇంకా ఆగలేదు… మన సినిమాకి మరో గౌరవం
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీక్ వంటి ఘటనలు జరుగకుండా చాలా జాగ్రత్తులు తీసుకున్నారు. అయినా టెన్త్ ఎక్సమ్ పేపర్ లీక్ కావడం చర్చనీయంశంగా మారింది. వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు సమాచారం. పరీక్ష ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది.
Also Read : కడుపు ఉబ్బరంగా ఉందా.. తగ్గాలంటే ఇలా చేయండి..
పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. 9 గంటల 37 నిమిషాలకే ప్రశ్నపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. అయితే ఈ ప్రశ్నపత్రం తాండూరులోని ఓ పరీక్ష కేంద్రం నుంచి లీకైనట్లు సమాచారం. అయితే పేపర్ లీకైనట్లు వస్తున్న వార్తలపై వికారాబాద్ డీఈవో స్పందించారు. తమ జిల్లాలో పేపర్ లీక్ కాలేందంటూ వివరణ ఇచ్చారు. అయితే ప్రశ్నపత్రం లీక్ వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన ఏర్పడింది. తాండూరు నంబర్ వన్ స్కూల్ లో బందెప్ప అనే టీచర్ ఉదయం 9.37 నిమిషాలకు త ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్ లో క్వశ్చన్ పేపర్ పెట్టినట్లు పోలీసులు నిర్దారించారు. ఫోటో ఎన్ని గంటలకు తీశారు ? పరీక్ష కంటే ముందే ఫోటో తీసి ఎవరికైనా ఇచ్చారా ?అని పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు బందెప్ప ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. తాండూర్ లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కలకలం నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో డీఈఓ రేణుకా దేవి సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో