Shivakumar: యడ్యూరప్పను బీజేపీ వేధించింది.. కర్ణాటక వీధుల్లో యడ్డీ కన్నీళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం తీవ్రమైంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉన్న అధికారం నిలుపుకునేందుకు అధికార బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే, అధికారం హస్తంగతం చేసుకోవాలని కాంగ్రెస్ కూడా గట్టి పట్టుదలతో ఉంది. నాయకులు హోరాహోరి ప్రచారంతో కన్నడనాడు దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి తన సొంత పార్టీ నాయకుడు బిఎస్ యడియూరప్పను వేధించిందని ఆయన ఆరోపించారు. యడియూరప్ప కన్నీళ్లు కర్ణాటక వీధుల్లో ప్రవహించాయన్నారు. యడ్డీని తన సొంత పార్టీ, ఏజెన్సీల నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని డికె శివకుమార్ చెప్పారు. ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో అవినీతిపై బీజేపీకి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ,హోం మంత్రి అమిత్ షా కర్ణాటకలో ఎన్నికలను నడపలేరన్నారు.
Also Read: Shivathmika: ఎద అందాలు చూపిస్తూ బర్త్ డే ట్రీట్ ఇచ్చిన శివాత్మిక
కర్ణాటక ప్రజలు బాగా చదివారు, చదువుకున్నవారని తెలిపారు. దేశంలోనే కర్ణాటక అవినీతి రాజధానిగా మారిందని, ప్రధాని ఏం చేశారు అని ప్రశ్నించారు. కర్ణాటకలో అవినీతిని ప్రధాని మోదీ ఆపలేదని డీకే శివకుమార్ అన్నారు. మే 10న కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ 140 సీట్లు గెలుచుకుంటుందని శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న లింగాయత్లు, రాజకీయంగా ప్రభావవంతమైన సామాజికవర్గానికి చెందిన వారు. తమ మద్దతును బిజెపి నుండి కాంగ్రెస్కు మళ్లించారని డికె శివకుమార్ పేర్కొన్నారు. లింగాయత్లను బీజేపీ బెదిరింపులకు గురిచేస్తోందన్నారు. వారికి న్యాయం జరగలేదు’ అని ఆయన అన్నారు.
Also Read:Violence in Bengal : బెంగాల్లో మరోసారి హింస.. కలిగంజ్లో చెలరేగిన ఘర్షణలు
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
దక్షిణాదిలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంతో యడియూరప్ప కీలక పాత్ర పోషించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన BS యడియూరప్ప కర్ణాటకలో ఎన్నికల విజయానికి కీలకమైన లింగాయత్ ఓటర్లలో పెద్ద వర్గాలలో ప్రజాదరణ పొందారు. దాదాపు రెండు దశాబ్దాలుగా వీరశైవ-లింగాయత్ల మద్దతుపై కన్నేసిన అధికార బీజేపీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇరుకున పడింది. ఉత్తర కర్ణాటకకు చెందిన ఇద్దరు ప్రముఖ లింగాయత్ నాయకులు బీజేపీని వీడారు. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది ఇద్దరూ కాషాయ శిబిరం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. లక్ష్మణ్ సవాడి గనిగ లింగాయత్ ఉప వర్గానికి చెందినవారు కాగా, జగదీష్ షెట్టర్ రాజకీయంగా బలమైన బాణాజీగ లింగాయత్ ఉప వర్గానికి చెందినవారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు కార్డు బీఎస్వై ఒక్కటేనని, అందుకే ఆయనను ‘కమలం రాజు’గా మార్చారని నిపుణులు చెబుతున్నారు. తాను రాజకీయాలకు రాజీనామా చేసినప్పటికీ 2023లో కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!