Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bjp Harassed Yediyurappa His Tears Have Flown On Streets Of Karnataka Says Shivakumar

Shivakumar: యడ్యూరప్పను బీజేపీ వేధించింది.. కర్ణాటక వీధుల్లో యడ్డీ కన్నీళ్లు..

Published Date :April 22, 2023 , 7:52 pm
By NTV WebDesk
Shivakumar: యడ్యూరప్పను బీజేపీ వేధించింది.. కర్ణాటక వీధుల్లో యడ్డీ కన్నీళ్లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం తీవ్రమైంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉన్న అధికారం నిలుపుకునేందుకు అధికార బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే, అధికారం హస్తంగతం చేసుకోవాలని కాంగ్రెస్ కూడా గట్టి పట్టుదలతో ఉంది. నాయకులు హోరాహోరి ప్రచారంతో కన్నడనాడు దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి తన సొంత పార్టీ నాయకుడు బిఎస్ యడియూరప్పను వేధించిందని ఆయన ఆరోపించారు. యడియూరప్ప కన్నీళ్లు కర్ణాటక వీధుల్లో ప్రవహించాయన్నారు. యడ్డీని తన సొంత పార్టీ, ఏజెన్సీల నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని డికె శివకుమార్ చెప్పారు. ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో అవినీతిపై బీజేపీకి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ,హోం మంత్రి అమిత్ షా కర్ణాటకలో ఎన్నికలను నడపలేరన్నారు.
Also Read: Shivathmika: ఎద అందాలు చూపిస్తూ బర్త్ డే ట్రీట్ ఇచ్చిన శివాత్మిక

కర్ణాటక ప్రజలు బాగా చదివారు, చదువుకున్నవారని తెలిపారు. దేశంలోనే కర్ణాటక అవినీతి రాజధానిగా మారిందని, ప్రధాని ఏం చేశారు అని ప్రశ్నించారు. కర్ణాటకలో అవినీతిని ప్రధాని మోదీ ఆపలేదని డీకే శివకుమార్ అన్నారు. మే 10న కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ 140 సీట్లు గెలుచుకుంటుందని శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న లింగాయత్‌లు, రాజకీయంగా ప్రభావవంతమైన సామాజికవర్గానికి చెందిన వారు. తమ మద్దతును బిజెపి నుండి కాంగ్రెస్‌కు మళ్లించారని డికె శివకుమార్ పేర్కొన్నారు. లింగాయత్‌లను బీజేపీ బెదిరింపులకు గురిచేస్తోందన్నారు. వారికి న్యాయం జరగలేదు’ అని ఆయన అన్నారు.
Also Read:Violence in Bengal : బెంగాల్‌లో మరోసారి హింస.. కలిగంజ్‌లో చెలరేగిన ఘర్షణలు

Also Read

  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ
  • Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్‌లు.. అవాక్కైన నెటిజన్లు
  • Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ

దక్షిణాదిలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంతో యడియూరప్ప కీలక పాత్ర పోషించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన BS యడియూరప్ప కర్ణాటకలో ఎన్నికల విజయానికి కీలకమైన లింగాయత్ ఓటర్లలో పెద్ద వర్గాలలో ప్రజాదరణ పొందారు. దాదాపు రెండు దశాబ్దాలుగా వీరశైవ-లింగాయత్‌ల మద్దతుపై కన్నేసిన అధికార బీజేపీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇరుకున పడింది. ఉత్తర కర్ణాటకకు చెందిన ఇద్దరు ప్రముఖ లింగాయత్ నాయకులు బీజేపీని వీడారు. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది ఇద్దరూ కాషాయ శిబిరం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. లక్ష్మణ్ సవాడి గనిగ లింగాయత్ ఉప వర్గానికి చెందినవారు కాగా, జగదీష్ షెట్టర్ రాజకీయంగా బలమైన బాణాజీగ లింగాయత్ ఉప వర్గానికి చెందినవారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు కార్డు బీఎస్‌వై ఒక్కటేనని, అందుకే ఆయనను ‘కమలం రాజు’గా మార్చారని నిపుణులు చెబుతున్నారు. తాను రాజకీయాలకు రాజీనామా చేసినప్పటికీ 2023లో కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BS Yediyurappa
  • dk shivakumar
  • karnataka
  • karnataka elections

తాజావార్తలు

  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన

  • RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా..

  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ

  • Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions