Shivakumar: యడ్యూరప్పను బీజేపీ వేధించింది.. కర్ణాటక వీధుల్లో యడ్డీ కన్నీళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం తీవ్రమైంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉన్న అధికారం నిలుపుకునేందుకు అధికార బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే, అధికారం హస్తంగతం చేసుకోవాలని కాంగ్రెస్ కూడా గట్టి పట్టుదలతో ఉంది. నాయకులు హోరాహోరి ప్రచారంతో కన్నడనాడు దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి తన సొంత పార్టీ నాయకుడు బిఎస్ యడియూరప్పను వేధించిందని ఆయన ఆరోపించారు. యడియూరప్ప కన్నీళ్లు కర్ణాటక వీధుల్లో ప్రవహించాయన్నారు. యడ్డీని తన సొంత పార్టీ, ఏజెన్సీల నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని డికె శివకుమార్ చెప్పారు. ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో అవినీతిపై బీజేపీకి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ,హోం మంత్రి అమిత్ షా కర్ణాటకలో ఎన్నికలను నడపలేరన్నారు.
Also Read: Shivathmika: ఎద అందాలు చూపిస్తూ బర్త్ డే ట్రీట్ ఇచ్చిన శివాత్మిక
కర్ణాటక ప్రజలు బాగా చదివారు, చదువుకున్నవారని తెలిపారు. దేశంలోనే కర్ణాటక అవినీతి రాజధానిగా మారిందని, ప్రధాని ఏం చేశారు అని ప్రశ్నించారు. కర్ణాటకలో అవినీతిని ప్రధాని మోదీ ఆపలేదని డీకే శివకుమార్ అన్నారు. మే 10న కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ 140 సీట్లు గెలుచుకుంటుందని శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న లింగాయత్లు, రాజకీయంగా ప్రభావవంతమైన సామాజికవర్గానికి చెందిన వారు. తమ మద్దతును బిజెపి నుండి కాంగ్రెస్కు మళ్లించారని డికె శివకుమార్ పేర్కొన్నారు. లింగాయత్లను బీజేపీ బెదిరింపులకు గురిచేస్తోందన్నారు. వారికి న్యాయం జరగలేదు’ అని ఆయన అన్నారు.
Also Read:Violence in Bengal : బెంగాల్లో మరోసారి హింస.. కలిగంజ్లో చెలరేగిన ఘర్షణలు
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
దక్షిణాదిలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంతో యడియూరప్ప కీలక పాత్ర పోషించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన BS యడియూరప్ప కర్ణాటకలో ఎన్నికల విజయానికి కీలకమైన లింగాయత్ ఓటర్లలో పెద్ద వర్గాలలో ప్రజాదరణ పొందారు. దాదాపు రెండు దశాబ్దాలుగా వీరశైవ-లింగాయత్ల మద్దతుపై కన్నేసిన అధికార బీజేపీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇరుకున పడింది. ఉత్తర కర్ణాటకకు చెందిన ఇద్దరు ప్రముఖ లింగాయత్ నాయకులు బీజేపీని వీడారు. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది ఇద్దరూ కాషాయ శిబిరం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. లక్ష్మణ్ సవాడి గనిగ లింగాయత్ ఉప వర్గానికి చెందినవారు కాగా, జగదీష్ షెట్టర్ రాజకీయంగా బలమైన బాణాజీగ లింగాయత్ ఉప వర్గానికి చెందినవారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు కార్డు బీఎస్వై ఒక్కటేనని, అందుకే ఆయనను ‘కమలం రాజు’గా మార్చారని నిపుణులు చెబుతున్నారు. తాను రాజకీయాలకు రాజీనామా చేసినప్పటికీ 2023లో కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!