సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వాలు సహకరించాలి: బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి, అల్లు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని శనివారం రాత్రి జరిగిన అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారితో తనకు చనువు ఉందని… తన తండ్రి ఎన్టీఆర్ గారికి అల్లు రామలింగయ్య గారు ఓ నటుడిగా కంటే ఓ మనిషిగా చాలా ఇష్టమని బాలయ్య తెలిపారు. అఖండ మూవీ విషయానికి వస్తే .. నవ పూజ విధానాల సమాహారమే ఈ సినిమా అని పేర్కొన్నారు. భక్తిని ఈ సినిమా బ్రతికించిందని బాలయ్య పేర్కొన్నారు. ఇక ముందు వైవిధ్యభరితమైన పాత్రలో కనిపిస్తానని… నటన అంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడమని బాలయ్య తెలిపారు. తనకు అల్లు అర్జున్, శ్రీకాంత్ తమ్ముళ్ల లాంటి వాళ్లని బాలయ్య చెప్పారు.
మరోవైపు కరోనా సమయంలో కొంతమంది ప్రాణాలకు తెగించి షూటింగులు జరిపారని… వాళ్లు ఏం చేసినా సినిమా కోసమే చేశారని బాలయ్య వ్యాఖ్యానించారు. కష్టకాలంలో ఉన్న సినిమా ఇండస్ట్రీకి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని బాలయ్య కోరారు. రానున్న కాలంలో పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయని… తమ్ముడు నటించిన పుష్ప, ఎన్టీఆర్ నటించిన ఆర్.ఆర్.ఆర్, చిరంజీవి గారు నటించిన ఆచార్య సినిమా రిలీజ్ అవుతున్నాయని… ఈ సినిమాలు మంచిగా ఆడేలా ప్రభుత్వాలు సహకరించాలని కోరుకుంటున్నానని బాలయ్య ఆకాంక్షించారు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. నందమూరి అభిమానులు ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తారని.. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న అభిమానులను చూస్తే తనకు చాలా గర్వంగా ఉంటుందని బాలయ్య అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!