కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.. నేను చనిపోయేవరకు కూడా ఆగలేరా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. తాజాగా మరోసారి అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.. దీనిపై మీడియాతో మాట్లాడిన ఆయన.. మాన్సాన్ ట్రస్ట్ విషయంలో నా నియామకంపై హైకోర్టు మరోసారి అనుకూలంగా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు.. వరసగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలినా బుద్ది రావడంలేదని మండిపడ్డారు.. కోర్టులో ప్రభుత్వానికి ప్రతిసారి చుక్కెదురవ్వడంపై ఆలోచించుకోవాలని సూచించిన ఆయన.. ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం మాన్సాస్ వ్యవహారంలో తలదూర్చిందన్నారు.. ఇష్టానుసారంగా నియామకాలు చేసి ట్రస్ట్ ని డ్యామేజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. హైకోర్టు చెప్పినా కూడా ఇప్పటివరకు ఈవో నన్ను కలవలేదన్నారు.. నేను ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోవడం లేదు.. నేను అడిగిన వివరాలు కరెక్ట్గా ఇవ్వలేదు.. ప్రభుత్వం అడ్డుగోలు వ్యవహారాలు చేస్తూ, దేవాలయాలను డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింహాచలంలో సీతారాములు కోవెలలో కూలిన ధ్వజస్తంభం పై వివరాలు కోసం రిపోర్ట్ అడుగుతాను అన్నారు అశోక్గజపతిరాజు.. దేవాలయాలపై రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఆచారాలకు విరుద్ధంగా నియమాలు మార్చారని ఆరోపించారు.. దేవాలయాలు పై దాడులు చేసిన పట్టించుకోలేదు.. డబ్బులు వచ్చే దేవాలయాలపై పెత్తనం చెలాయించడానికి ప్రభుత్వం చూస్తోందని.. దేవాలయాల ఆస్తులు కాజేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఇక, హిందూమతం మీద దాడి చేస్తున్నారని విమర్శించిన అశోక్ గజపతిరాజు.. దేవాదాయశాఖ పూర్తిగా సక్రమంగా నడవడం లేదన్నారు. మరోవైపు.. జాయింట్ కలెక్టర్లకు ఆ శాఖ బాధ్యతలు అప్పజెప్పడం సరికాదన్న ఆయన.. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయన్నారు.. దేవుడు మీద నమ్మకం లేనివల్లే ఇలాంటి పనులు చేస్తారని.. మాజీ చైర్మన్ ఉద్ధరించిది తక్కువ, అలజడి సృష్టించింది ఎక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
చైర్మన్ సీటు కోసం చేసిన పోరాటం.. ట్రస్ట్ని బాగుచేయడం మీద లేదంటూ సెటైర్లు వేశారు అశోక్ గజపతిరాజు.. నా తర్వాత ఇంకా అబ్బాయిలు ఎవరు లేరు.. నేను చనిపోయేంతవరకు కూడా ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఛైర్మన్ సీటు కోసం అన్ని రకాలుగా ప్రయత్నలు చేస్తున్నారు… సంచయిత గజపతిరాజు.. ఆవిడ కోసం కొన్న రెండు కార్లు ఇంతవరకు అప్పజెప్పారో లేదో ఈవో చెప్పలేదన్నారు.. సిబ్బందికి జీతాలు ఇవ్వడం కోసం డబ్బులు లేవు అని చెప్పిన సంచయిత.. కోటి రూపాయలు పెట్టి రెండు కార్లు ఎలా కొన్నారని ప్రశ్నించారు.. ఏదో ఒక రోజు ఇవి అన్నీ బయటకు వస్తాయి.. మర్చిపోవద్దు అని హెచ్చరించారు.. ట్రస్ట్ బోర్డ్ వివరాలు ఇంతవరకు అడిగితే ఇవ్వలేదన్న ఆయన.. ఆడిట్ కోసం అడిగిన ప్రతిసారి మా దగ్గర స్టాఫ్ కొరత అని చెప్పారు.. కానీ, ఇప్పుడు అన్ని ఏళ్లు ఆడిట్ పెండింగ్ అని చెపుతున్నారని మండిపడ్డారు.. ఆడిట్ ని పెద్ద బూచి లాగా ప్రభుత్వం బయటకి చూపిస్తోందని విమర్శించారు. జనాల్ని మభ్యపెట్టడానికి విశ్వప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని.. మాన్సాన్ ట్రస్ట్ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ట్యాక్స్గా కడుతుంటే.. మా మీద పెత్తనం చేయాలని చూస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!