AP: ఇవాళే కీలక భేటీ.. ఆ తర్వాత మంత్రులంతా రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఈ రోజు కీలక ఘట్టం జరగబోతోంది. మంత్రి మండలి రద్దు కానుంది.. సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో చివరి క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశం ప్రస్తుతం ఉన్న మంత్రులకు చివరిది అవుతుంది. కొత్తపేటకు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. సమావేశం అనంతరం మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పిస్తారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు సంకేతాలు అందటంతో చివరి సమావేశాలు అని బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
ఇక, మంత్రులు ఇచ్చిన రాజీనామా పత్రాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గరకు స్వయంగా తీసుకుని వెళతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అదే సమయంలో కొత్త మంత్రి వర్గ జాబితాను గవర్నర్ కు అందజేస్తారు. మరోవైపు ఎవరికి తిరిగి బెర్త్ దక్కుతుంది? ఎవరికి కొత్తగా క్యాబినెట్ లో స్థానం లభిస్తుంది అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. మరోవైపు అశావహులు తీవ్ర ప్రయత్నాల్లో మునిగిపోయారు. వచ్చే రెండు మూడు రోజుల్లో కీలక పరిణామాలు జరగనుండడంతో వైసీపీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన సీఎం జగన్.. ప్రధాని మోడీ సహా పలువురు నేతల్ని కలిసి కీలక అంశాలపై చర్చించారు. విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. ఇటు కొత్త జిల్లాల విషయాన్ని కూడా వారికి వివరించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి చర్చలు జరిపారు. హస్తిన నుంచి ఏపీకి చేరుకున్న తర్వాత.. నిన్న సాయంత్రం గవర్నర్ను కలిసి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు, మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి అపాయింట్మెంట్ కోరారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!