ఇటీవల తెలంగాణ మంత్రులు, ఎంపీలు ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసింది. అయితే ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే ఢిల్లీలో దాదాపు 4 రోజుల పాటు ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కలకలం రేగింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
అలాగే ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఇప్పడు తాజాగా ఎంపీ కేశవరావుకు కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అయితే ప్రస్తుతం ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో వైద్యులు ఆయనను హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.