Arvind Kejriwal: రాజస్థాన్పై ఆప్ గురి.. బీజేపీ, కాంగ్రెస్ సంగతేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే పనిలో ఆప్ అధినేత కేజ్రీవాల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఆప్ ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో అధికారం చేపట్టారు. ఇప్పుడు రాజస్థాన్పై ఫోకస్ పెంచారు. రాజస్థాన్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో బీజేపీ పాలించింది. ప్రతి ఏడాది అధికారం మారడం రాజస్థాన్లో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆప్ దూకుడు పెంచింది. రాజస్థాన్లో అధికారం దిశగా అడుగులు వేస్తోంది.
Also Read:Jana Sena: వారాహి ఆగదు.. పవన్ షెడ్యూల్లో స్వల్ప మార్పు
ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలో ఉన్న నేతల మధ్య వర్గపోరు, విభేదాలతో పార్టీ అగ్రనాయకత్వానికి తలనొప్పిగా మారింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికల్లో అధికారం మారడం ఆనవాయితీ. ఈ క్రమంలో సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం అన్న అభిప్రాయం ఉంది. అయితే మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఆమెను మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని కేంద్ర నాయకులు ప్రయత్నిస్తున్నందున పార్టీలో అంతర్గత పోరు జరుగుతోంది.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
రాజస్థాన్లో బీజేపీ పార్టీలో రాజే అత్యున్నత నాయకురాలిగా ఉన్నప్పటికీ, ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు పార్టీ అగ్ర నాయకత్వం సిద్ధం లేదనే తెలుస్తోంది. రాష్ట్ర బిజెపి చీఫ్ సతీష్ పూనియా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ జాబితాలోకి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా చేరారు.
Also Read:Shocking Incident: బర్త్ డే రోజే చిన్నారి మృతి.. హృదయవిదారక ఘటన
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులు ఉంది. ఇద్దరి మధ్య వర్గపోరుతో కాంగ్రెస్లో చీలికలు మొదలైయ్యాయి. ఇటు బీజేపీపై కూడా ప్రజలు సంతృప్తిగా లేరు. రెండు పార్టీల గందరగోళాల మధ్య, ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నాయి. ఈ క్రమంలోమూడో ప్రత్యామ్నాయంగా ఆప్ దూసుకు వస్తోంది. మొత్తం 200 స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ యోచిస్తోంది.
కాంగ్రెస్లో గెహ్లాట్.. సచిన్ పైలట్తో పోరాడుతున్నారు. బిజెపిలోని వారందరూ వసుంధర రాజెకి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య కలిసి వస్తుందన్న ఆప్ నేతలు భావిస్తున్నారు. రాజస్థాన్లో ఆప్కు 4 లక్షలకు పైగా సభ్యులు మాత్రమే ఉండగా, పంజాబ్ సరిహద్దులోని హనుమాన్గఢ్, గంగానగర్, బికనీర్, చురు వంటి జిల్లాల్లో ఆ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తోంది. అవినీతిపై పోరాటం చేస్తూ కేజ్రీవాల్ పార్టీ స్థాపించారు.ఈ క్రమంలో ఢిల్లీలో పోటీ రెండోసారి అధికారం చేపట్టారు. ఇక, గత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఆప్ నేత భగవంత్ మాన్..పంజాబ్ ముఖ్యమంత్రిగా అయ్యారు. గుజరాత్ ఎన్నికల్లోనూ ఆప్ పోటి చేసింది. అయితే, అక్కడ బీజేపీ హవా ముందు నిలబడలేకపోయింది. ఇప్పుడు రాజస్థాన్ లోనూ అధికారం చేపట్టాలని ఆప్ అవకాశం కోసం ఎదురుచూస్తోంది. అయితే, రాజస్థాన్లో AAP ప్రవేశం మూడవ ఎంపికగా సాధ్యమవుతుందా లేదా గుజరాత్లో జరిగినట్లుగా కాంగ్రెస్ ఓట్లను పలుచన చేస్తుందా అనే ప్రశ్నలు ఉన్నాయి.
Also Read:Budget Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్!
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!