Arvind Kejriwal: రాజస్థాన్పై ఆప్ గురి.. బీజేపీ, కాంగ్రెస్ సంగతేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే పనిలో ఆప్ అధినేత కేజ్రీవాల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఆప్ ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో అధికారం చేపట్టారు. ఇప్పుడు రాజస్థాన్పై ఫోకస్ పెంచారు. రాజస్థాన్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో బీజేపీ పాలించింది. ప్రతి ఏడాది అధికారం మారడం రాజస్థాన్లో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆప్ దూకుడు పెంచింది. రాజస్థాన్లో అధికారం దిశగా అడుగులు వేస్తోంది.
Also Read:Jana Sena: వారాహి ఆగదు.. పవన్ షెడ్యూల్లో స్వల్ప మార్పు
ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలో ఉన్న నేతల మధ్య వర్గపోరు, విభేదాలతో పార్టీ అగ్రనాయకత్వానికి తలనొప్పిగా మారింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికల్లో అధికారం మారడం ఆనవాయితీ. ఈ క్రమంలో సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం అన్న అభిప్రాయం ఉంది. అయితే మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఆమెను మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని కేంద్ర నాయకులు ప్రయత్నిస్తున్నందున పార్టీలో అంతర్గత పోరు జరుగుతోంది.
Also Read
- Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
రాజస్థాన్లో బీజేపీ పార్టీలో రాజే అత్యున్నత నాయకురాలిగా ఉన్నప్పటికీ, ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు పార్టీ అగ్ర నాయకత్వం సిద్ధం లేదనే తెలుస్తోంది. రాష్ట్ర బిజెపి చీఫ్ సతీష్ పూనియా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ జాబితాలోకి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా చేరారు.
Also Read:Shocking Incident: బర్త్ డే రోజే చిన్నారి మృతి.. హృదయవిదారక ఘటన
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులు ఉంది. ఇద్దరి మధ్య వర్గపోరుతో కాంగ్రెస్లో చీలికలు మొదలైయ్యాయి. ఇటు బీజేపీపై కూడా ప్రజలు సంతృప్తిగా లేరు. రెండు పార్టీల గందరగోళాల మధ్య, ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నాయి. ఈ క్రమంలోమూడో ప్రత్యామ్నాయంగా ఆప్ దూసుకు వస్తోంది. మొత్తం 200 స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ యోచిస్తోంది.
కాంగ్రెస్లో గెహ్లాట్.. సచిన్ పైలట్తో పోరాడుతున్నారు. బిజెపిలోని వారందరూ వసుంధర రాజెకి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య కలిసి వస్తుందన్న ఆప్ నేతలు భావిస్తున్నారు. రాజస్థాన్లో ఆప్కు 4 లక్షలకు పైగా సభ్యులు మాత్రమే ఉండగా, పంజాబ్ సరిహద్దులోని హనుమాన్గఢ్, గంగానగర్, బికనీర్, చురు వంటి జిల్లాల్లో ఆ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తోంది. అవినీతిపై పోరాటం చేస్తూ కేజ్రీవాల్ పార్టీ స్థాపించారు.ఈ క్రమంలో ఢిల్లీలో పోటీ రెండోసారి అధికారం చేపట్టారు. ఇక, గత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఆప్ నేత భగవంత్ మాన్..పంజాబ్ ముఖ్యమంత్రిగా అయ్యారు. గుజరాత్ ఎన్నికల్లోనూ ఆప్ పోటి చేసింది. అయితే, అక్కడ బీజేపీ హవా ముందు నిలబడలేకపోయింది. ఇప్పుడు రాజస్థాన్ లోనూ అధికారం చేపట్టాలని ఆప్ అవకాశం కోసం ఎదురుచూస్తోంది. అయితే, రాజస్థాన్లో AAP ప్రవేశం మూడవ ఎంపికగా సాధ్యమవుతుందా లేదా గుజరాత్లో జరిగినట్లుగా కాంగ్రెస్ ఓట్లను పలుచన చేస్తుందా అనే ప్రశ్నలు ఉన్నాయి.
Also Read:Budget Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్!
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!