Budget Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయసభలూ మరుసటి రోజుకు వాయిదా పడనున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 24 వరకు సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మధ్యాహ్నం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్ లో ఆమోదిస్తారు.
Also Read:Jansena: నేడు జనసేన ఆవిర్భావ సభ… ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న పవన్
ఈ నెల 17 లేదా 18న సభలో 2023-2024 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ రూ. 2లక్షల 60 వేల కోట్లకు పైగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా సంక్షేమంతో పాటు విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేస్తోంది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్. ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నందున వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో సంక్షేమ పథకాలకు మరిన్ని బడ్జెట్ కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. విశాఖపట్నంలో జరగనున్న జి-20 కార్యవర్గ కమిటీ సమావేశం దృష్ట్యా ప్రభుత్వం మార్చి 28 లోపు బడ్జెట్ సెషన్ను ముగించే అవకాశం ఉంది.
Also Read:Instagram Cheating: బంపర్ ఆఫర్.. మూడు రోజుల్లో మూడు రెట్ల వడ్డీ
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
ఈ సమావేశాల్లో సీఎం జగన్ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేయనున్నారు.విశాఖ నుంచి పాలన ప్రారంభించడంపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నాలుగేళ్ల పాలనతో పాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు వంటి ముఖ్యమైన అంశాల ఎజెండాతో సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.
మరోవైపు ప్రజా సమస్యలపై ఉభయసభల్లో చర్చకు పట్టుపట్టాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయించింది. విద్యుత్ ఛార్జీల పెంపు, పోలవరం, రైతుల సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్.లోకేశ్ హాజరుకాకపోవచ్చని సమాచారం. MLC పదవీకాలం మార్చి 28న ముగియనుండడంతో బడ్జెట్ సెషన్ ఆయనకు చివరిది. 4,000 కిలోమీటర్ల యువగళం పాదయాత్రలో ఉన్నందున లోకేష్ హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీకి హాజరు కాబోనని గతంలో చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!