షర్మిల పాదయాత్రకు సర్వం సిద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాదయాత్ర అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్. ఆయన కంటే ముందు.. ఆ తర్వాత ఎంతోమంది పాదయాత్రలు చేశారు. అయినా పాదయాత్రలకు మాత్రం ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారంలోకి రావడానికి వైఎస్ అనుసరించిన ఈ ఫార్మూలా ఆ తర్వాత ఎంతోమంది నాయకులకు ఆదర్శంగా నిలిచింది. వైఎస్ఆర్ స్ఫూర్తితో పాదయాత్ర చేపట్టిన ఎంతోమంది రాజకీయ నాయకులు ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రులు అయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఏపీలో పాదయాత్ర చేపట్టారు. ఓదార్పు యాత్ర, పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లి జననేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల కష్టాసుఖాలను తెలుసుకొని వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను తయారు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించడంతో ప్రస్తుతం ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గడిచిన రెండేళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో సంక్షేమమే ప్రధాన ఏజెండా ముందుకు వెళుతున్నారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
ఇక వైఎస్ఆర్ కూతురు షర్మిల సైతం తెలంగాణలో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా ఆమె వైఎస్ఆర్టీపీని స్థాపించారు. వైఎస్ఆర్ మాదిరిగానే ఆమె సైతం తెలంగాణలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభం కానుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రను చేవేళ్ల నుంచి ప్రారంభించగా షర్మిలా సైతం అదే జిల్లా నుంచి పాదయాత్రను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.
షర్మిలకు పాదయాత్ర కొత్తేమీ కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి అందుబాటులో లేని సమయంలో ఆమె ఆపార్టీ కోసం పాదయాత్ర చేపట్టారు. జగన్ వదిలిన బాణం అంటూ ఏకంగా 3,112 కిలోమీటర్ల పాదయాత్రను ఏపీలో పూర్తి చేశారు. అత్యధిక దూరం పాదయాత్ర చేపట్టిన తొలి మహిళగా ఆమె పేరు రికార్డుకెక్కింది. అయితే తన రికార్డును తానే బద్దలు చేసేలా తెలంగాణలో 4వేల పాదయాత్రను షర్మిల చేయబోతున్నారు. జీహెచ్ఎంసీ మినహా తెలంగాణలోని 90నియోజకవర్గాల పరిధిలో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.
ఈ పాదయాత్రను షర్మిల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిని విజయవంతం చేసేందుకు ఆపార్టీ మొత్తంగా 26 కమిటీలను ఏర్పాటు చేసింది. నియోజకవర్గాల వారీగా బాధ్యతలను పార్టీలోని ముఖ్యనేతలకు అప్పగించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులను కలుపుకుపోయేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. షర్మిల పాదయాత్రకు ఆమె తల్లి విజయమ్మ పూర్తి మద్దతు ఇస్తున్నారు. పీకే టీం సైతం షర్మిలతోనే నడిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్, జగన్ కు కలిసొచ్చిన పాదయాత్ర షర్మిలకు ఏమేరకు కలిసి వస్తుందో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?