షర్మిల పాదయాత్రకు సర్వం సిద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాదయాత్ర అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్. ఆయన కంటే ముందు.. ఆ తర్వాత ఎంతోమంది పాదయాత్రలు చేశారు. అయినా పాదయాత్రలకు మాత్రం ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారంలోకి రావడానికి వైఎస్ అనుసరించిన ఈ ఫార్మూలా ఆ తర్వాత ఎంతోమంది నాయకులకు ఆదర్శంగా నిలిచింది. వైఎస్ఆర్ స్ఫూర్తితో పాదయాత్ర చేపట్టిన ఎంతోమంది రాజకీయ నాయకులు ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రులు అయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఏపీలో పాదయాత్ర చేపట్టారు. ఓదార్పు యాత్ర, పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లి జననేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల కష్టాసుఖాలను తెలుసుకొని వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను తయారు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించడంతో ప్రస్తుతం ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గడిచిన రెండేళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో సంక్షేమమే ప్రధాన ఏజెండా ముందుకు వెళుతున్నారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
ఇక వైఎస్ఆర్ కూతురు షర్మిల సైతం తెలంగాణలో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా ఆమె వైఎస్ఆర్టీపీని స్థాపించారు. వైఎస్ఆర్ మాదిరిగానే ఆమె సైతం తెలంగాణలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభం కానుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రను చేవేళ్ల నుంచి ప్రారంభించగా షర్మిలా సైతం అదే జిల్లా నుంచి పాదయాత్రను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.
షర్మిలకు పాదయాత్ర కొత్తేమీ కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి అందుబాటులో లేని సమయంలో ఆమె ఆపార్టీ కోసం పాదయాత్ర చేపట్టారు. జగన్ వదిలిన బాణం అంటూ ఏకంగా 3,112 కిలోమీటర్ల పాదయాత్రను ఏపీలో పూర్తి చేశారు. అత్యధిక దూరం పాదయాత్ర చేపట్టిన తొలి మహిళగా ఆమె పేరు రికార్డుకెక్కింది. అయితే తన రికార్డును తానే బద్దలు చేసేలా తెలంగాణలో 4వేల పాదయాత్రను షర్మిల చేయబోతున్నారు. జీహెచ్ఎంసీ మినహా తెలంగాణలోని 90నియోజకవర్గాల పరిధిలో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.
ఈ పాదయాత్రను షర్మిల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిని విజయవంతం చేసేందుకు ఆపార్టీ మొత్తంగా 26 కమిటీలను ఏర్పాటు చేసింది. నియోజకవర్గాల వారీగా బాధ్యతలను పార్టీలోని ముఖ్యనేతలకు అప్పగించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులను కలుపుకుపోయేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. షర్మిల పాదయాత్రకు ఆమె తల్లి విజయమ్మ పూర్తి మద్దతు ఇస్తున్నారు. పీకే టీం సైతం షర్మిలతోనే నడిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్, జగన్ కు కలిసొచ్చిన పాదయాత్ర షర్మిలకు ఏమేరకు కలిసి వస్తుందో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!