ఏపీలో వైసీపీ పాలనపై నటుడు అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో జగన్ పాలన అద్భుతంగా ఉందన్నారు. ఏపీలో అన్ని వర్గాలకు సీఎం జగన్ సమన్యాయం చేస్తున్నారని అలీ కొనియాడారు. టాలీవుడ్కు సమస్యగా మారిన ఆన్ లైన్ టిక్కెట్ల విధానం, బెనిఫిట్ షోల వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అలీ పేర్కొన్నారు. దీనిపై జగన్ సానుకూలంగానే ఉన్నారని భావిస్తున్నట్లు అలీ తెలిపారు.
Read Also: ఏపీలో పరిస్థితులనే ‘అఖండ’ సినిమాలో చూపించారు: చంద్రబాబు
మరోవైపు కృష్ణా జిల్లాలోని KLU యూనివర్సిటీ తనకు డాక్టరేట్ ప్రకటించడంపై అలీ స్పందించారు. తనకు కేఎల్యూ యాజమాన్యం డాక్టరేట్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని అలీ వెల్లడించారు. సొంత ఊరిలో ఉండగా ఈ డాక్టరేట్ రావడం మరింత సంతోషం కలిగించిందని అలీ వెల్లడించారు. కాగా జగన్ ప్రభుత్వం తనకు మంత్రి పదవి ఇస్తే మరింత ఆనందమంటూ అలీ తన మనసులోని మాటను బయటపెట్టాడు.