రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ భారీ బడ్జెట్తో నిర్మించబడింది. దీంతో ఈ సినిమాకు ప్రత్యేకంగా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. అన్ని థియేటర్లు ప్రతి టికెట్పై రూ.75 ధర పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జీవో విడుదల చేశారు. సినిమా రిలీజ్ కానున్న ఈ నెల 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ప్రత్యేక ధరలు…
ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ శుక్రవారం రిలీజ్ అవుతోంది. అయితే ఏపీలో ఈ మూవీ టిక్కెట్ రేట్లపై తొలుత సందిగ్ధత నెలకొంది. ఏపీలో 20 శాతం షూటింగ్ జరిపిన సినిమాలకే టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాధేశ్యామ్ షూటింగ్ 20 శాతం మేర జరపకపోవడంతో ఈ సినిమా టిక్కెట్ రేట్లపై ఎలాంటి నిర్ణయం వస్తుందో అని గురువారం సాయంత్రం వరకు ఆన్లైన్లో కూడా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభం కాలేదు. ఈ…
కొత్త జీవో కోసం టాలీవుడ్ చేసిన పోరాటం ఫలించింది… కొత్త జీవో వచ్చేసింది అని అంతా సంతోషించే సమయంలోనే చిక్కులు మొదలయ్యాయి. ముఖ్యంగా కొత్త జీవో ప్రకారం శుక్రవారం విడుదల కానున్న “రాధేశ్యామ్”కు తిప్పలు తప్పట్లేదు. ఇక భారీ బడ్జెట్ తో పెద్ద సినిమాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి పెద్ద సినిమాలకు కొత్త జీవో 13తో ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఈ కొత్త జీవో కారణంగా 100 కోట్లు దాటినా పెద్ద బడ్జెట్ సినిమాలు ఇష్టానుసారంగా…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్కు మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇప్పుడు వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ సూపర్స్టార్ మహేష్ బాబు ట్విట్టర్లో స్పందించారు. Read Also : Poonam Kaur : యూట్యూబర్లకు వార్నింగ్… చర్యలు తప్పవు ! “కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా…
ఇప్పుడు టాలీవుడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” ఫీవర్ పట్టుకుంది. అయితే ఏపీలో మాత్రం ఇంకా థియేటర్లు, టికెట్ రేట్లపై వివాదం నడుస్తూనే ఉంది. అయితే “భీమ్లా నాయక్” విడుదలకు ముందే సవరించిన టిక్కెట్ ధర GOను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుందని అంతా భావించారు. ఏపీ ప్రభుత్వం థియేటర్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అక్కడ టిక్కెట్ ధరలు తక్కువగా ఉండడంతో ఇప్పటికే కొన్ని థియేటర్లు మూతపడ్డాయి. నిన్న ‘భీమ్లా నాయక్’…
ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై ఇంకా ఎటూ తేలలేదు. పేదలకు సహాయం చేయడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తమ పనిని సమర్థించుకుంటుంటే, పలువురు సినీ ప్రముఖులు మాత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమ పట్ల, ఎగ్జిబిషన్ రంగం పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సినిమా పెద్దలు కోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా టికెట్ ధరల నియంత్రణను సవాలు చేస్తూ…
ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో సంచలనంగా మారింది. థియేటర్ల యాజమాన్యంతో సినిమా సెలెబ్రిటీలు కూడా చాలా మంది ఈ వివాదంపై స్పందించారు. ఏపీ ప్రభుత్వం మరోమారు ఆలోచించుకోవాలని కోరారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి జగన్ పరిష్కరించాలని బహిరంగ వేదికలపైనే విన్నవించుకున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఆ విన్నపాలు ఏమాత్రం కరగలేదు. అంతేకాదు సినిమా టికెట్ రేట్ల విషయంలో తగ్గేదే లే అని, ఎవరూ ఆ విషయం గురించి…
సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ఏపీ టికెట్ రేట్లపై ఇష్యూ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఈ వివాదంపై సైలెంట్ గా ఉన్న మోహన్ బాబు టికెట్ల ధరలపై రేపు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. సినిమా టికెట్ల ధరలపై తొలిసారి మోహన్బాబు స్పందించబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. Read Also : టాలీవుడ్ లో సంక్రాంతి సంబరం… పోటీకి సై అంటున్న చిన్న సినిమాలు !! మరోవైపు అల్లూరి సీతారామ రాజు…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి భేటి శుక్రవారం జరిగింది. హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షతన శుక్రవారం జరిగిన వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్న సభ్యులు సినిమా టిక్కెట్ల ధరలు, థియేటర్లలోని మౌలిక వసతులు, ప్రేక్షకుల స్పందనపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. కమిటీలోని సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్న ఛైర్మన్ జనవరి రెండోవారంలో ప్రత్యక్షంగా సభ్యులందరితోనూ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాలను…