అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై రౌడీషీట్లు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న కార్యకర్తకు కష్టమొచ్చినా.. నేనున్నంటూ వాలిపోతారు ఆ జిల్లాలోని టీడీపీ నేతలు. అరెస్ట్లు చేస్తే అక్రమమని అండగా నిలుస్తారు. అలాంటిది పార్టీలో ముఖ్యమైన నాయకుడి కుటుంబానికి ఇబ్బందొస్తే సొంతవారితోపాటు పార్టీవాళ్లెవరూ కిమ్మనలేదు. టీడీపీలో ఎవరా ముఖ్యనేత? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
2019 తర్వాత రాజకీయంగా ఎదురు దెబ్బలు
Also Read
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం.
జిల్లాతోపాటు టెక్కలిలోనూ వారి ఆధిపత్యం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఎర్రన్న తనయుడు రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం ఎంపీ. ఆయన కుమార్తె ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే. ఇంతటి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కింజరాపు కుటుంబానికి 2019 ఎన్నికల తర్వాత రాజకీయంగా వరస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
అచ్చెన్న బంధువులు ముగ్గురిపై రౌడీషీట్లు
టెక్కలిలో ఎమ్మెల్యేగా గెలిచి చురుకైన పాత్ర పోషిస్తోన్న అచ్చెన్నాయుడు ఏసీబీ కేసులో జైలుకెళ్లాల్సి వచ్చింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత పంచాయతీ ఎన్నికల్లోనూ కేసులతో నలిగిపోయారు. ప్రస్తుతం అచ్చెన్న కుటుంబానికి చెందిన ముగ్గురిపై రౌడీషీట్స్ తెరిచారు. అచ్చెన్న అన్నయ్య హరివరప్రసాద్తోపాటు హరిప్రసాద్ కుమారుడు సురేష్, సమీప బంధువు కృష్ణమూర్తిపై కోటబొమ్మాళి పోలీసులు రౌడీషీట్లు తెరిచారు. హరివరప్రసాద్, కృష్ణమూర్తిపై 2088, 2010లో క్రిమినల్ కేసులున్నాయి.
read also : సీఎం కేసీఆర్ తో భేటీపై కాంగ్రెస్లో విమర్శల జల్లు!
22 మందిపై నాన్బెయిల్బుల్ కేసులు
పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో ఓ రేంజ్లో పొలిటికల్ రగడ జరిగింది. వైసీపీ బలపర్చిన కింజరాపు అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంతో నాటకీయ పరిణామాలు సంభవించాయి. ఆ సమయంలో పోలీసుల విధినిర్వహణకు ఆటంకం కల్పించారని ఆరోపణలు రావడంతో అచ్చెన్న కుటుంబసభ్యులు 22 మందిపై నాన్బెయిల్బుల్ కేసులు నమోదయ్యాయి. అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేయగా హరివరప్రసాద్, సురేష్లు బెయిల్ తెచ్చుకున్నారు. అప్పట్లో హరివరప్రసాద్, సురేష్, అచ్చెన్నాయుడి సమీప బంధువు కృష్ణమూర్తిపై కోటబొమ్మాళి పోలీసులు బైండోవర్లు ఓపెన్ చేశారు. సీన్ కట్ చేస్తే ఈ కేసులు పెట్టిన 4 నెలల తర్వాత ఇప్పుడు రౌడీషీట్లు ఓపెన్ చేయడం చర్చగా మారింది.
రౌడీషీట్లు తెరిచినా కిమ్మనని తెలుగు తమ్ముళ్లు
బైండోవర్ రూల్స్ ఉల్లంఘించడంతోపాటు పాత కేసులు ఉండటంతో రౌడీషీట్లు ఓపెన్ చేశామన్నది పోలీసుల వాదన. అయితే ఇది కక్షపూరిత చర్యగా ఆరోపిస్తోంది టీడీపీ. కింజరాపు కుటుంబంపై ఈగవాలినా ఊరుకోని తెలుగు తమ్ముళ్లు.. ఈ ఎపిసోడ్లో మాత్రం కిమ్మనకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. జిల్లాలో టీడీపీకి అనేక మంది ముఖ్యనేతలు ఉన్నా.. ఒక్కరూ స్పందించలేదు. పార్టీలో చిన్న కార్యకర్తపై కేసుపెడితే అక్రమం అని రోడ్డెక్కే నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదట.
జరిగేదేదో జరుగుతుందని ఊరుకున్నారా?
అచ్చెన్నను అరెస్ట్ చేసిన సమయంలో నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలియజేసిన తెలుగు తమ్ముళ్లు కామైపోయారు. పార్టీ నేతల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఈ చర్యలపై అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు సైతం స్పందించడానికి ఆసక్తి చూపించలేదు. ఏం మాట్లాడాలో కూడా పార్టీ నేతలకు ఆదేశాలు ఇవ్వలేదట. ఈ పరిణామాలే జిల్లా రాజకీయాలలో చర్చగా మారాయి. జరిగేదేదో జరుగుతుంది.. మన ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే ధోరణిలో అచ్చెన్నాయుడు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే రౌడీషీట్లపై ఆయన నో కామెంట్ అన్నారట. నాయకుడే మౌనంగా ఉంటే మనకెందుకు.. మనమూ మౌనంగా ఉంటే సరిపోతుందని ఎక్కడి వారు అక్కడే గప్చుప్ అయ్యారట పార్టీ శ్రేణులు.
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?