నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 40 మంది సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నదిలో ప్రయాణిస్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. నౌకమొత్తం వ్యాప్తించడంతో.. 40 మంది సజీవంగా దహనమైన విషాద ఘటన బంగ్లాదేశ్లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తెల్లవారుజామున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలోకతి సమీపంలోని సుగంధ నదిపై మూడు అంతస్తుల నౌక ప్రయాణం చేస్తుండగా.. మంటలు చెలరేగాయి.. నిమిషాల వ్యవధిలోనే పూర్తిస్థాయిలో నౌక మొత్తం వ్యాపించాయి మంటలు.. ఈ ఘటనలో 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 40 మృతదేహాలను వెలికితీశామని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. మంటలకు భయపడి కొందరు నదిలోకి దూకేశారని.. నీటిలో మునిగి మరికొందరు మరణించారని స్థానిక పోలీసు చీఫ్ మొయినుల్ ఇస్లాం వెల్లడించారు.
నౌకలో 310 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ కనీసం 500 మంది ప్రయాణం చేస్తున్నారని.. వీరిలో చాలామంది రాజధాని నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నారని.. దాదాపు 100 మందిని కాలిన గాయాలతో బారిసాల్లోని ఆస్పత్రులకు తరలించామని తెలిపారు అఇకారులు.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నౌకలో మంటలు చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.. మేం గ్రౌండ్ ఫ్లోర్ డెక్పై చాప మీద నిద్రిస్తున్నాము. ప్రయాణీకులందరూ నిద్రిస్తున్నారు.. నా తొమ్మిదేళ్ల మనవడు కూడా ఉన్నాడు.. మంటల ధాటికి నా మనవడు నదిలోకి దూకాడు, అతనికి ఏమి జరిగిందో తెలియదంటూ ఓ వృద్ధురాలు కన్నీరు మున్నీరైంది.. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చాలా మంది ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొంతమంది నిద్రిస్తున్న క్యాబిన్ల నుండి బయటకు రాలేకపోయారని.. చాలా మంది నదిలోకి దూకారాని.. బరిసాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న మరో వ్యక్తి వెల్లడించారు. మంటలు చెలరేగిన గంటలోపే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టామని జిల్లా పాలనాధికారి జోహార్ అలీ తెలిపారు. ప్రయాణికులతో మాట్లాడాం.. 500 నుంచి 700 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నట్టు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!