నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 40 మంది సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నదిలో ప్రయాణిస్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. నౌకమొత్తం వ్యాప్తించడంతో.. 40 మంది సజీవంగా దహనమైన విషాద ఘటన బంగ్లాదేశ్లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తెల్లవారుజామున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలోకతి సమీపంలోని సుగంధ నదిపై మూడు అంతస్తుల నౌక ప్రయాణం చేస్తుండగా.. మంటలు చెలరేగాయి.. నిమిషాల వ్యవధిలోనే పూర్తిస్థాయిలో నౌక మొత్తం వ్యాపించాయి మంటలు.. ఈ ఘటనలో 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 40 మృతదేహాలను వెలికితీశామని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. మంటలకు భయపడి కొందరు నదిలోకి దూకేశారని.. నీటిలో మునిగి మరికొందరు మరణించారని స్థానిక పోలీసు చీఫ్ మొయినుల్ ఇస్లాం వెల్లడించారు.
నౌకలో 310 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ కనీసం 500 మంది ప్రయాణం చేస్తున్నారని.. వీరిలో చాలామంది రాజధాని నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నారని.. దాదాపు 100 మందిని కాలిన గాయాలతో బారిసాల్లోని ఆస్పత్రులకు తరలించామని తెలిపారు అఇకారులు.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నౌకలో మంటలు చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.. మేం గ్రౌండ్ ఫ్లోర్ డెక్పై చాప మీద నిద్రిస్తున్నాము. ప్రయాణీకులందరూ నిద్రిస్తున్నారు.. నా తొమ్మిదేళ్ల మనవడు కూడా ఉన్నాడు.. మంటల ధాటికి నా మనవడు నదిలోకి దూకాడు, అతనికి ఏమి జరిగిందో తెలియదంటూ ఓ వృద్ధురాలు కన్నీరు మున్నీరైంది.. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చాలా మంది ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొంతమంది నిద్రిస్తున్న క్యాబిన్ల నుండి బయటకు రాలేకపోయారని.. చాలా మంది నదిలోకి దూకారాని.. బరిసాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న మరో వ్యక్తి వెల్లడించారు. మంటలు చెలరేగిన గంటలోపే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టామని జిల్లా పాలనాధికారి జోహార్ అలీ తెలిపారు. ప్రయాణికులతో మాట్లాడాం.. 500 నుంచి 700 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నట్టు తెలిపారు.
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!