Army jawans dead: వాహనంలో మంటలు.. నలుగురు ఆర్మీ జవాన్లు సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో తమ వాహనం మంటల్లో చిక్కుకోవడంతో నలుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భాటా ధురియన్ ప్రాంతానికి సమీపంలో జరిగింది. పిడుగుపాటు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. పూంచ్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘటనాస్థలికి ఆర్మీ, పోలీసు సిబ్బంది చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
Also Read: Karnataka Elections: కర్ణాటకలో ప్రచారానికి ప్రధాని మోదీ.. 20 చోట్ల భారీ బహిరంగ సభలు
గత ఏడాది డిసెంబరులో, రాజస్థాన్లోని ఉదయపూర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియన్ ఆర్మీ ట్రక్కులో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగాయి. ఉదయపూర్లోని మిలటరీ స్టేషన్కు వెళుతున్న ఐదు వాహనాల కాన్వాయ్లోని ట్రక్కులో మంటలు వచ్చాయి. అయితే, ఈ ఘటనలో సిబ్బంది, ప్రాణ నష్టం జరగలేదు. 2021లో రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడి మంటలు చెలరేగడంతో ముగ్గురు సైనికులు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
Also Read
తాజావార్తలు
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..