Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Topheadlines 9am 28 12 2022

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Published Date :December 28, 2022 , 9:00 am
By NTV WebDesk
Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ ఛార్జీలు, పెంపు..!

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు త్వరలో బ్యాడ్ న్యూస్ అందనుంది. మెట్రో రైలు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపుపై హైదరాబాద్ మెట్రో అధికారులు ఇప్పటికే సెంట్రల్ ఫేర్ ఫిక్సేషన్ కమిటీకి ప్రతిపాదనలు పంపారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి శ్యామ్ ప్రసాద్ చైర్మన్‌గా, కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సురేంద్ర కుమార్ బాగ్డే, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. గత నెలలో సమావేశమైన కమిటీ సభ్యులు కూడా మెట్రో రైలు ఛార్జీల సవరణకు సంబంధించి ప్రజల అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తీసుకున్నారు. దీంతో త్వరలోనే ఛార్జీలు పెరగనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం రూ.10 ఉన్న తొలి టికెట్ ధరను రూ.20, గరిష్ట ధర రూ.60 నుంచి రూ.80 వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గుడ్ న్యూస్.. వారికి ఈవెంట్స్‌ లేవు డైరెక్ట్‌గా మెయిన్సే

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రిలిమినరీ పరీక్షలు ముగియగా.. ప్రస్తుతం ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న గర్భిణుల కోసం పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఈవెంట్‌ల నుంచి గర్భిణీలకు మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ, కానిస్టేబుల్ పోస్టుల ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన కొందరు మహిళలు ప్రెగ్నెన్సీ కారణంగా ఈవెంట్‌లకు హాజరు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసు శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గర్భిణులు నేరుగా మెయిన్స్ రాసుకునే వెసులుబాటు కల్పించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే వారికి నెల రోజుల్లో భౌతికకాయాలు నిర్వహిస్తామని పోలీసు శాఖ తెలిపింది.

రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన.. నేడు భద్రాద్రి, రామప్ప ఆలయాలు దర్శనం

శీతాకాల విడిది కోసం భాగ్యనగరానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు భద్రాచలం రాములవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆసిఫాబాద్‌లో నూతనంగా నిర్మించిన ఏకలవ్య పాఠశాలను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. భద్రాచలం, సారపాక మండలాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయలుదేరింది. రాష్ట్రపతి రాత్రి 7:40 గంటలకు హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేడియానికి చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో ఉదయం 7:50 గంటలకు బయలుదేరి 8:50 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 9:50 గంటలకు భద్రాచలంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటుంది. 10:00 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో 10:10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. భాద్రాద్రి దర్శనం అనంతరం భారత రాష్ట్రపతి దౌపది ముర్ము రామప్ప పర్యటనకు బయలు దేరనున్నారు.

నేటి నుంచే తెలంగాణలో పదోవిడత రైతు బంధు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్‌కు పెట్టుబడి సాయం కింద నేటి నుంచి రైతుబంధు నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఎకరం పొలం ఉన్న రైతుల నుంచి మొదలు పెట్టి సంక్రాంతి సందర్భంగా రైతులందరి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. నేటి నుంచి నగదు జమ ప్రక్రియ ప్రారంభం కానుండగా, రైతుబంధు కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.7,676 కోట్ల నిధులను విడుదల చేసింది. దాదాపు 70.54 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 28 నుంచి రైతుబంధు డబ్బులు అందజేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 15లోపు రైతులందరి ఖాతాల్లో గతంలో జమ చేసిన విధంగా ఎకరం నుంచి నగదు జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కోతలు లేకుండా పూర్తిగా అందించాలని సూచించారు.

మంత్రి అంబటికి కౌంటర్.. సోది ఆపి పోలవరం సంగతి చూడు

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి కీలక నేతలు విమర్శలు గుప్పించారు. అన్నయ్య షోకు డుమ్మా.. బాలయ్య షోకు జమ్మ.. రక్తసంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించారు. మంత్రి అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు. ‘ఏయ్.. ముందెళ్లి పోలవరం సంగతి చూడవోయ్.. వె.ధ.వ.సోది’ అంటూ సమాధానం ఇచ్చారు.

నేపాల్‌లో వరసగా రెండు భూకంపాలు

హిమాలయ దేశం నేపాల్ ను వరసగా భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా బుధవారం నేపాల్ లో రెండు భూకంపాలు సంభవించాయి. నేషనల్ ఎర్త్ క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున నేపాల్ లోని బగ్‌లుంగ్ జిల్లాలో 4.7, 5.3 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. జిల్లాలోని అధికారి చౌర్ ప్రాంతంలో తెల్లవారుజామున 1.23 గంటలకు 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తరువాత ఖుంగా ప్రాంతంలో 2.07 గంటలకు రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. బుధవారం ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో వచ్చింది. తెల్లవారుజామున 2.19 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు.

పంత్‌కు పంచ్.. శిఖర్ ధావన్ కెరీర్ ముగిసినట్లేనా..?

కొత్త ఏడాది ఆరంభంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను మంగళవారం రాత్రి సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో సీనియర్లంతా టెస్టు, వన్డే ఫార్మాట్లపై ఫోకస్ పెడతారని గతంలోనే బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే కొంతకాలంగా టీ20లు, టెస్టులకు కాకుండా కేవలం వన్డేలకు మాత్రమే ఎంపికవుతూ సారథిగా ఆడుతున్న శిఖర్ ధావన్‌కు శ్రీలంకతో వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. దీనికి కారణం ధావన్ ఫామ్ అనే చెప్పాలి. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ధావన్ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని సెలక్టర్లు పక్కనపెట్టారు. అసలే ఓపెనింగ్‌కు రోహిత్, రాహుల్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్‌గిల్ వంటి ప్రతిభావంతులు పోటీలో ఉండగా ధావన్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో కూడా అతడు లేనట్లేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అతడి కెరీర్‌కు చరమగీతం పడినట్లే భావించాలని పలువురు భావిస్తున్నారు.

Fire Accident: విషాదం.. అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh News
  • ap news
  • news headlines
  • ntv news headlines
  • telangana hedline

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions