Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News Today Mohammed Rafi Death Anniversary

తెలుగువారితో రఫీ బంధం!

Published Date :July 31, 2021 , 5:20 am
By Manohar
తెలుగువారితో రఫీ బంధం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా మధురగాయకుడు మహ్మద్ రఫీ గానం మురిపించింది. ఆయన గాత్రంలో జాలువారిన వందలాది పాటలు ఈ నాటికీ అభిమానులకు ఆనందం పంచుతూనే ఉండడం విశేషం. మహ్మద్ రఫీ అనగానే తెలుగువారికి యన్టీఆర్ ‘భలేతమ్ముడు’ చిత్రం ముందుగా గుర్తుకు వస్తుంది. నిజానికి ఆ సినిమా కంటే ముందే నటగాయక నిర్మాతదర్శకుడు చిత్తూరు వి.నాగయ్య నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘రామదాసు’లో మహ్మద్ రఫీ పాట పాడారు. అందులో కబీర్ పాత్ర ధారి గుమ్మడికి రఫీ నేపథ్యగానం చేశారు. అయితే ఆ పాట హిందీలోనే ఉండడం విశేషం. “కహే కరోనా…” అంటూ సాగే ఆ పాటతోనే రఫీ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. ఈ పాటకు స్వతహాగా సంగీత దర్శకుడైన నాగయ్య పర్యవేక్షణలో అశ్వథ్థామ బాణీలు కట్టారు. ఆ సినిమాలో యన్టీఆర్, ఏయన్నార్, శివాజీగణేశన్, జెమినీగణేశన్ వంటి మేటి నటులు నాగయ్యపై అభిమానంతో బిట్ రోల్స్ లో కనిపించారు. అలాగే రఫీ కూడా గాయకుడైన నాగయ్య నిర్మించిన చిత్రం కాబట్టి తనకు పారితోషికం వద్దన్నారు. అప్పటికే రఫీ తమ చిత్రంలో ఒక్క పాట పాడినా చాలు అనుకుంటూ ఉత్తరాది చిత్ర నిర్మాతలు భావించేవారు. అంతటి స్టార్ డమ్ చవిచూస్తున్నా, నాగయ్య గారిపై అభిమానంతో రఫీ పైసా పుచ్చుకోలేదు. ‘రామదాసు’ ఎప్పుడో ఆరంభమైనా, ఆ సినిమా 1964లో విడుదలయింది.

మహ్మద్ రఫీ మధురగానం యావద్భారతదేశాన్నీ ఉర్రూతలూగించింది. తెలుగునాట కూడా ఆయన పాటకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే హిందీలో విజయం సాధించిన ‘చీనా టౌన్’ చిత్రాన్ని తెలుగులో ‘భలేతమ్ముడు’గా నిర్మించే సమయంలో నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య, రఫీతోనే తెలుగులోనూ పాటలు పాడించాలని భావించారు. ‘భలేతమ్ముడు’ చిత్రంలో యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. రామారావు కూడా రఫీ పాట అనగానే ఓకే అన్నారు. అలా టి.వి.రాజు స్వరకల్పనలో మహ్మద్ రఫీ తెలుగు పాటలు పాడి అలరించారు. ‘భలే తమ్ముడు’లోని “ఎంతవారు గానీ… వేదాంతులైన గానీ…”, “గోపాలా బాలా నిన్నే కోరి…”, “గుమ్మా గుమ్మా గుమ్మా…” , ఖవ్వాళీ పాట… ‘చీనా టౌన్’ ట్యూన్స్ లోనే రూపొందాయి. అయితే “నేడే ఈ నాడే… “, పాటను టి.వి.రాజు సొంతగా కంపోజ్ చేశారు. ఆ పాటలో ‘నేడే ఈ నాండే…’ అని రఫీ పలకడం అప్పట్లో చర్చకు దారి తీసింది. అయినా ఆ మధురగానం జనాన్ని విశేషంగా అలరించింది.

తెలుగులో యన్టీఆర్ ‘భలే తమ్ముడు’తోనే అలరించిన రఫీ గానం, ఆ తరువాత కూడా యన్టీఆర్ సంబంధం ఉన్న చిత్రాలతోనే సాగడం విశేషం. ‘భలే తమ్ముడు’ తరువాత యన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘తల్లా పెళ్ళామా’లో “నువ్వు నవ్వుతున్నావు…నేను నవ్వుతున్నాను…” అనే పాటను పాడించారు. ఆ పై యన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా రూపొందిన ‘రామ్-రహీమ్’లో హరికృష్ణకు నేపథ్యగానం చేశారు రఫి. యన్టీఆర్ తో పుండరీకాక్షయ్య నిర్మించిన మరో రీమేక్ ‘ఆరాధన’. ఈ చిత్రంలోనూ మహ్మద్ రఫీ పాడిన పాటలు ఎంతగానో అలరించాయి. హిందీ చిత్రం ‘గీత్’ ఆధారంగా తెరకెక్కిన ‘ఆరాధన’ 1976 బ్లాక్ బస్టర్ గా నిలచింది. అందులోని “నా మది నిన్ను పిలిచింది గానమై…” పాట ఈ నాటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉండడం విశేషం. ఈ సినిమా తరువాత యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘అక్బర్ సలీమ్ అనార్కలి’లోనూ సలీమ్ పాత్రధారి బాలకృష్ణకు నేపథ్యగానం చేసి ఆకట్టుకున్నారు రఫి. ఇందులోని “తారలెంతగా మురిసేనో చందురుని కోసం…”, “రేయి ఆగిపోని…రేపు ఆగిపోని…”, “తానే మేలి ముసుగు తీసి…”, “హసీనా… ఓ హసీనా…” పాటలు రఫి గాత్రంలో జాలువారి మధురామృతం పంచాయి. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’లో ముస్లిమ్ రాజు పాత్రధారి సత్యనారాయణకు “దేవుడు ఒకడే ఆ దైవం ఒకడే…” అనే పాటను గానం చేశారు రఫి. ఇదే ఆయన తెలుగులో పాడిన చివరి పాట. అలా రామారావుతో రఫీ బంధం తెలుగువారికి మధురం పంచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • death anniversary
  • mohammed rafi
  • mohammed rafi death anniversary

తాజావార్తలు

  • Oil and Gas Prices Surge: అమాంతం పెరిగిపోయిన గ్యాస్‌, చమురు ధరలు..

  • CSK IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరం

  • Massive Water Cloud Discovered in Space: అంతరిక్షంలో భారీ మేఘం.. సముద్రాలన్నింటి కంటే 140 ట్రిలియన్ల రెట్ల ఎక్కువ నీరు..!

  • USA Crime : అమెరికాలో తెలుగు యువకుడు అరెస్ట్.. ఒక్క తప్పు జీవితం తలకిందులు..!

  • Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions