రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ది సస్పెక్ట్’. ఈ సినిమా మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్ కుమార్ నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా ది సస్పెక్ట్ కొత్త కోణంలో పరిశోధన, ఒక హత్య చుట్టూ జరిగే కథ. కిరణ్ కుమార్ నిర్మాతగాటెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతున్న ది సస్పెక్ట్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలియచేసారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన కెమెరామెన్ రాఘవేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ ప్రవీణ్ ప్రతిభ చిత్రంలో కనబడుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంది అన్నారు నిర్మాత కిరణ్ కుమార్. ఈ సినిమా ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో గ్రాండ్ గా మార్చి 21న విడుదల కానుంది.