Harish Rao : కేసీఆర్ చావు కోరుకోవడం దారుణం.. కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసింది
- కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ అన్యాయం
- తెలంగాణ కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు
- బీఆర్ఎస్ పోరాట ఫలితమే తెలంగాణకు న్యాయం
- నల్గొండ, ఖమ్మం రైతులకు బీఆర్ఎస్ తోనే న్యాయం : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చావును కోరుకోవడం ఎంత దారుణమో బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో కేసీఆర్ చావును కోరుతూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు, దీనికి నిరసనగా శాసనసభలో సీఎం ప్రసంగాన్ని బహిష్కరించినట్లు తెలిపారు.
అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేసిన హరీష్ రావు, కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అసెంబ్లీలో పూర్తిగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే 299 టీఎంసీల కృష్ణా నీటి పంపకాలు జరిగాయని, నిజానికి తెలంగాణలో అంత నీటిని వినియోగించేందుకు తగినన్ని ప్రాజెక్టులే లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులను నిర్మించలేకపోవడమే ఈ అన్యాయానికి కారణమని పేర్కొన్నారు.
Also Read
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
- CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..
- CJP Protest: ‘ఛలో పార్లమెంట్’ ఉద్యమంలో కీలక పరిణామం..
- Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో గతంలో కాంగ్రెస్ నేతలు ఒక్కరోజు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని, అయితే తాము 40 రోజుల పాటు అసెంబ్లీని స్థంభింపజేశామని గుర్తుచేశారు. తెలంగాణ నీటిని కాపాడేందుకు తమ పార్టీ మంత్రుల పదవులను వదులుకున్నా, కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చి కృష్ణా నీటిపై తాత్కాలిక నిర్ణయాలను ఆమోదించారని ఆరోపించారు.
కేసీఆర్ అంచెలంచెలుగా చేసిన పోరాటం వల్లే తెలంగాణకు నీటి న్యాయం సాధ్యమైందని హరీష్ రావు పేర్కొన్నారు. సెక్షన్ 3ని సాధించి 573 టీఎంసీల నీటిని తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. అంతేకాక, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్టే తెచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో నల్గొండ రైతులు నీటి కొరతతో తీవ్రంగా నష్టపోయారని, కానీ కేసీఆర్ నేతృత్వంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాకు నీటిని అందించగలిగామని హరీష్ రావు వివరించారు. గతంలో హుజూర్ నగర్ ని ముంచివేసి ఆంధ్రప్రదేశ్ మూడో పంటకు నీళ్లు ఇచ్చారని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పులిచింతల నిర్వాసితులకు వందల కోట్ల రూపాయల పరిహారం ఇచ్చి, వారికి న్యాయం చేసిందని హరీష్ రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మాటలు అబద్ధాలే, కేసీఆర్ పాలనతోనే తెలంగాణకు అభివృద్ధి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తోందని, అబద్ధాలే ప్రచారం చేస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటేనే ప్రజలు మరోసారి ఆ పార్టీని నమ్మరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ఎప్పుడూ ముందుండిందని, భవిష్యత్తులోనూ తమ పోరాటం కొనసాగిస్తామని హరీష్ రావు తెలిపారు.
తాజావార్తలు
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Toxic: ‘టాక్సిక్’ నుంచి మరో సర్ప్రైజ్.. యష్తో ఈసారి తారా సుతారియా రొమాన్స్!
-
Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
-
CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..
-
Rohit Sharma 21 Records: ఒక్క సెంచరీ.. 21 రేర్ రికార్డ్స్.. లార్డ్స్లో రఫ్ఫాడించిన రోహిత్ శర్మ!
ట్రెండింగ్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!